శ్రీకాకుళం జిల్లా, టెక్కలి అయోధ్య లో రాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్ల కల నేడు సఫలం అయినందున ఆనందం లో దేశం లో అందరూ ఒక్కసారిగా చాలా సంతోషకరంగా తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అదే విధంగా టెక్కలిలో భారీగా ఊరేగింపులు జరపడంతో పాటు భక్తులు జై శ్రీరామ్ అంటూ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసారు.
Tag:
Tekkali
శ్రీకాకుళం జిల్లా టెక్కలి డిగ్రీ కాలేజ్ ఎదురుగా స్టూడెంట్ పై నుండి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు దూసుకెళ్లడంతో, తీవ్ర గాయాలు పాలైన బెండి.సాయి( 24 ) అనే విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి టెక్కలి వెంకటేశ్వర కాలనీకి చెందిన బెండి ఉమామహేశ్వరి కొడుకు గా గుర్తించారు. మృతుడి తండ్రి తన చిన్నప్పుడే చనిపోవటం తో, తన తల్లి చదివించి, పెద్దచేసి అల్లారు ముద్దుగా పెంచుకుంది. కల్లెదురుగా కన్నకొడుకు చనిపోవటం తో కన్నీరు మున్నీరు గా విలపిస్తుంది.





Total views : 79850