మరో రెండు రోజులు ప్రచార సమయం ముగిస్తున్న సందర్భంలో అభ్యర్థులు పోట పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డీ ప్రచారం జోరుగ కొనసాగుతుంది. ఈరోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా132 డివిజన్ జీడిమెట్ల విలేజ్,మీనాక్షిఎస్టేట్, అంగడిపేట, పలు కాలనీలలో రోడ్డు షో ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోలన్ హన్మంత్ రెడ్డీ మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దీమవ్యక్తం చేశారు ఇందిరమ్మ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగిందని మళ్లీ ఇందిరమ్మ పాలన వస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు చేర్చే విధంగా కార్యకర్తలు పని చేస్తున్నారని తెలిపారు. గడిచిన పది సంవత్సరాలనుండి BRS పార్టీ చేసింది ఏమిలేదన్నారు. జరగబోయే ఎన్నికలలో BRS పార్టీ కి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కోలన్ హన్మంత్ రెడ్డీ అన్నారు.
telangana elections 2023
ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ తరపున కాక తన సొంత డబ్బులతో కూడా తన సేవా కార్యక్రమంలో భాగంగా ఇల్లు నిర్మించి ఇస్తానని బిఆర్ఎస్ నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని వెంకటాపూర్ గగ్గల పళ్లి గ్రామాలలో మర్రి జనార్దన్ రెడ్డి నేడు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మర్రి జనార్దన్ రెడ్డి వెంట నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తనయుడు నాగం శశిధర్ రెడ్డి లు పాల్గొన్నారు. ప్రచారానికి గ్రామాలలోని ప్రజలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. గగ్గలపల్లి గ్రామంలో శివాలయంలో పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్న మర్రి గ్రామంలో ఎన్నికల ప్రచారం పై ప్రసంగించారు. కారు గుర్తుకే ఓటు వేసి, రైతు సంక్షేమ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను మర్రి జనార్దన్ రెడ్డి కోరారు. ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న ప్రేమను ఆయన ఓటర్లకు తెలియజేశారు. మంగళవారం నుండి రైతుబంధు పైసలు టింగ్ టింగ్ అంటూ రైతుల ఖాతాలోకి వస్తాయని ఓటర్లకు తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, వృద్ధాప్య పెన్షన్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పనివి కూడా చేసి చూపించిన బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కారు కోరారు . కారు గుర్తుకే ఈ నెల 30న ఓటు వేయాలని అందర్నీ మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు . మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారానికి ఆయన వెంట ర్యాలీగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. త్వరలో నాగర్ కర్నూల్ జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల పాలిటెక్నిక్ కళాశాలను కూడా తీసుకు వస్తానని బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు.
కుత్బుల్లాపూర్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్న. కుత్బుల్లాపూర్ లో బలమైన నాయకుడు శ్రీశైలం గౌడ్. కుత్బుల్లాపూర్ లో ఏ సమస్యలు ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన సమిష్టిగా పోరాడుతుంది దేశానికి మోడీ గారి లాంటి బలమైన నాయకత్వం కావాలి. నా మిత్రుడు శ్రీశైలం ను ఎమ్మెల్యేగా గెలిపించాలి. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉంది బీసీ ముఖ్యమంత్రి బిజెపితోనే సాధ్యం. నరేంద్ర మోడీ గారికి ఓటేస్తే పవన్ కళ్యాణ్ కు ఓటేసినట్టే. కుత్బుల్లాపూర్ లో శ్రీశైలం గౌడ్ కు ఓటేస్తే పవన్ కళ్యాణ్ కు, జనసేనకు వేసినట్టే. దేశంలో ఉగ్రదాడులు జరగకుండా బలంగా నిలబడిన పార్టీ బిజెపి. నరేంద్ర మోడీ గారి లాంటి ఒక బలమైన నాయకత్వంలో దేశం ప్రగతిపథాన నడుస్తుంది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రైతులకు రైతుబంధు నిధులను ఇవ్వకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో రైతులకు న్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. శనివారం నాడు రావిర్యాల, మోహబ్బత్ నగర్, కే. సి. తండా, మహేశ్వరం, తుక్కు గూడ జరిగిన రోడ్ షో లలో మంత్రి ప్రసంగించారు. తెలంగాణలో కర్ణాటక మోడల్ అమలు చేస్తామని పేర్కొంటూ రైతులకు మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనడం శోచనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నా, కేవలం మూడు గంటలు రైతులకు చాలని అవమానపరచడం కాంగ్రెస్ పార్టీకి తగదని మంత్రి పేర్కొన్నారు. అవసరమైతే రైతులు 10 ఎచ్ పి మోటార్లు బిగించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఉచిత సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. మరో వైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు మోటార్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి చేసిందని, మీటర్లు పెట్టకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కోత పెడుతామని బెదిరించిందని, అయినా మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారని మంత్రి వివరించారు. దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన 25 వేల కోట్ల రూపాయల నిధులను నిలిపివేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొనడాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.25 వేల కోట్ల నష్టం చేసిన బీజేపీకి ఓట్లడిగే అర్హతే లేదని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమని బీజేపీ సర్కారు ఒత్తిడి చేసిందని మేము చెబుతుంటే లేదు లేదు తమ ప్రభుత్వం ఆ మాటే అనలేదని తెలంగాణ బీజేపీ నేతలు అదరగొట్టిండ్రని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా మోటార్లకు మీటర్లు పెట్టారని, ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతారని అన్నారు. పొరపాటున కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయవద్దని కోరారు. అభివృద్ధి సంక్షేమ రంగాల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి స్థానంలో నిలపాలని ప్రజల్ని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్నికల్లో ఇస్తున్న హామీలను కూడా తప్పని సరిగా నెరవేరుస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేసిఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని మంత్రి హరీష్ రావు సతిమని శ్రీనిత పిలుపునిచ్చారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అంచలంచలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోయే రోజుల్లో తప్పకుండా వస్తాయని ఆమె తెలిపారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్ రావు కు మద్దతుగా పలు వార్డులలో హరీష్ రావు సతీమణి తిరిగి ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచార సందర్భంగా పట్టణంలో హరీష్ రావు సతీమణికి భారీ స్పందన లభించింది.
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి సేవకుడు చింత ప్రభాకర్ కి మా మద్దతుతని జిల్లా వీరశైవ లింగాయత్ మాజీ అధ్యక్షులు ఏ సిద్దేశ్వర్, జిల్లా గౌరవ అధ్యక్షులు శివచంద్ర పాటిల్ అన్నారు. వీరశైవ లింగాయత్ సమాజం తరఫున శనివారం విలేకరుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. వీరశైవ లింగాయత్ అభివృద్ధి కోసం చింత ప్రభాకర్ పట్టణంలోని బసవ సేవా సదన్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం కృషి 50 లక్షలు నిధులు ఇవ్వడం జరిగిందని ఎడ్ల బజార్ బసవేశ్వర కళ్యాణ మండపానికి 40 లక్షల రూపాలు రావడానికి కృషి చేసిన చింత ప్రభాకర్ కే మా ఓటు అని తీర్మానం చేశామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాష్ట్ర వీర సేవా సమాజం భవనం కోసం కోక పేటలో కోట్ల విలువ చేసే ఎకరం స్థలం ఇవ్వడం జరిగిందని జిల్లా సమాజ భవనం కోసం కంది మండలంలో సుమారు ఐదు కోట్ల విలువ స్థలాన్ని కేటాయించడం జరిగిందని, అదేవిధంగా కేసీఆర్ బసవ జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షినియమన్నారు. నియోజకవర్గంలోని వీరశైవులందరూ చింత ప్రభాకర్ గెలుపు కోసం కృషి చేయాలని సమాజం తరఫున పిలుపునిచ్చారు. సమావేశంలో సమాజం జిల్లా కోశాధికారి చంద్ర కాంత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పపల్లి నర్సింలు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆత్మకూరు నాగేష్, జిల్లా నాయకులు మల్లికార్జున్ గందిగేరాజు శాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈరోజు మందమర్రి పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో CRPF జవాన్ లతో పాటు మందమర్రి పోలీస్ సర్కిల్ పరిది సిబ్బందితో cisf బ్యారక్ నుండి మందమర్రి రైల్వేస్టేషన్ రోడ్ మార్కెట్ ఏరియా వరకు వివిధ బస్తి లలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం లో బెల్లంపల్లి ఏసీపీ పి. సదయ్య, మంచిర్యాల డీసీపీ సుదీర్ కేకన్ CRPF అధికారులు, సీఐ మహేందర్ రెడ్డి మందమర్రి సర్కిల్ పరిది నాలుగు పిఎస్ ఎస్ఐ లు పాల్గొన్నారు. ఇట్టి పోలీస్ కవాతు అనంతరం బెల్లంపల్లి ఏసీపీ సదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు మరియు ప్రజలు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకునేందుకు ప్రజలకు మేము వున్నాము అనే భరోసాను కల్పించుటకు గాను ఇట్టి పోలీస్ కవాతు నిర్వహించటం జరిగిందని, అదేవిధంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్నీ రాజకీయ పార్టీలు సహకరించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, చివరి ఘట్టంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి కేసుల పాలవద్దని పోలీస్ లకు ప్రజలు సహకరించాలని కోరారు.
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల వాతావరణం పోటా పోటీగా సాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ మున్నూరు కాపు మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు మడికొండ వెంకటేశ్వర్ రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మల్క రామస్వామి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పెండేల సంపత్, మంథని కో ఆర్డినేటర్ ఆకుల కిరణ్ తో పాటు పలువురు నాయకులు శనివారం మంథని పట్టణ కేంద్రంలోని ప్రెస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…ఒక బిసి బిడ్డ అయిన పుట్ట మధుకర్ కు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహా సభ తరుఫున కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మంథని నియోజకవర్గంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలతో పుట్ట మధుకర్ ప్రజలకు చేసిన అభివృద్ధి ఎనలేనిదనీ కొనియాడారు. 2 జిల్లాలలోని 10 మండలాలలో విస్తరించి ఉన్న మంథని నియోజకవర్గంలో మొత్తం మున్నూరు కాపుల ఓట్లు 45000 పైగా ఉన్నాయని, నియోజకవర్గంలోని అన్ని మున్నూరు కాపు ఓట్లు వేసి పుట్ట మధుకర్ ను గెలిపించుకుంటామని ముక్త కంఠంతో అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణ రాష్టాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతారని అన్నారు కోరుట్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్. నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో మంద కృష్ణ మాదిగ తో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ 30 యేండ్ల నుండి కొట్లాడుతున్న వర్గీకరణ పై ఎ ఒక్క ప్రభుత్వం కూడా స్పందించలేదు. నరేంద్ర మోడీ స్పందించి వర్గీకరణ కు కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ లో బీసీ ని ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీ బీజేపీ కాబట్టి అందరు కలిసి బీజేపీ కి ఓట్లు వేయాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లు ప్రజలను మోసం చేశాయన్నారు. అరవింద్ మాట్లాడుతూ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఉన్నారా ఉంటే విజిల్ వేయండి అంటూ అరవింద్ కూడ విజిల్ వేసి ఓటర్లను ఆకట్టుకున్నారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం లోని హస్తాల్పూర్., బండమీదిపల్లి, ముల్లూరు గ్రామం, పెద్దాపూర్ గ్రామం లో బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వస్తే పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతుందని మెదక్ జిల్లా నర్సాపూర్ బి ఆర్ ఎస్ అభ్యర్థి సునీత రెడ్డి అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం లో పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామాలకు బాగు లేని రోడ్లకు కొత్త రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. మహిళలందరికీ మహిళా సమాఖ్య భవనాలు కట్టడం జరుగుతుందన్నారు. సౌభాగ్య లక్ష్మి పేరుతో ప్రత్యేకంగా నెలకు 3000 ఇవ్వడం జరుగుతుందన్నారు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్యాస్ సిలిండరు 400 కు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి 15 లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అధికారమిస్తే దాంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.





Total views : 198626