హైదరాబాద్లోని NTR మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా ఊపి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఏ శాఖకు నిధులు ఆలస్యం అయినా.. ఆరోగ్య శాఖకు మాత్రం ప్రతి నెల.. నిధులు విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు. అలాగే గత BRS ప్రభుత్వం లో ఆరోగ్య సమస్యలు వస్తే.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆస్పత్రుల్లో చూపించుకోవడానికి డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయారని , ప్రస్తుతం ఆ పరిస్థితులు పేద ప్రజలకు రాష్ట్రంలో లేవన్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ప్రతి పౌరునికి ఏడాదికి 10 లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని భట్టి గుర్తు చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా.. ప్రజల ఆరోగ్యంపై మరిన్ని చర్యలు తీసుకుంటున్నమని.. కానీ బీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి బహిరంగ లేఖ..ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్రెడ్డి. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
- హైదరాబాద్లో అంతులేకుండా పోతున్న రియల్ మోసాలు..హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
- పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 38443