వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ను భారీ ఎల్ఈడి స్క్రీన్ లో తిలకిస్తున్న యువత. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శ్రీ కృత్తివేంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను 3 వేల మంది యువత తిలకించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్ ను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఏర్పాటు చేశారు. ఇండియా క్రికెట్ టీం,ఆస్ట్రేలియా క్రికెట్ టీం తో తలపడుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించి కేరింతలు కొడుతున్నారు. ఇండియా గెలవాలని కోరుకుంటున్నారు క్రికెట్ వీరాభిమాని బిక్కిన సునయన ఇండియా గెలుపొందాలని కోరుకుంటూ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బిగ్ స్క్రీన్ వద్ద హల్చల్ చేశారు ఇండియా గెలిసి వరల్డ్ కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
World Cup 2023
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కాటన్ పార్కు లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు బిగ్ స్క్రీన్ వద్ద వైసీపీ నాయకులు క్రీడాభిమానులతో కలసి మ్యాచ్ ను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాభిమానులు అంతా పండుగ వాతావరణంలో మ్యాచ్ ను వీక్షిస్తున్నారని ఇండియా ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also..
దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంతో తెలుగు సీనియర్ నటుడు వెంకటేశ్ విరాట్ సెంచరీని సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ‘క్లాస్ ఇన్నింగ్స్. విరాట్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంతకుమించిన బర్త్డే సెలబ్రేషన్స్ ఉండవు’ అంటూ వెంకటేశ్ క్యాప్షన్ ఇచ్చారు.
వన్డే ప్రపంచకప్లో భారత్ వరుసగా 8 విజయాలను నమోదు చేసింది. దక్షిణాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమ్ఇండియా 16 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తొలుత భారత్ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అలరించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా ఐదు వికెట్ల ప్రదర్శనతో సఫారీ జట్టును కుప్పకూల్చాడు.
వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఇంగ్లండ్ జట్టును కూడా టీమిండియా అలవోకగా ఓడించింది. తద్వారా టోర్నీలో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసుకుని సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. అయితే లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలి, 100 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లతో మరోసారి సత్తా చాటడం విశేషం. బుమ్రాకు 3, కుల్దీప్ యాదవ్ కు 2, జడేజాకు 1 వికెట్ లభించాయి. ఇంగ్లండ్ జట్టులో లియామ్ లివింగ్ స్టన్ చేసి 27 పరుగులే అత్యధికం. టాపార్డర్ వైఫల్యంతో ఏ దశలోనూ ఇంగ్లండ్ విజయం దిశగా పయనిస్తున్నట్టు కనిపించలేదు. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్ ను ఒత్తిడిలోకి నెట్టేశారు.వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ కు ఇది వరుసగా నాలుగో ఓటమి. ఇక ఈ టోర్నీలో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు పూర్తిగా ఆవిరయ్యాయి. టీమిండియా 6 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ 6 మ్యాచ్ ల్లో 1 విజయం సాధించి కేవలం రెండు పాయింట్లతో జాబితాలో అట్టడుగున ఉంది.





Total views : 79496