దివంగత వైయస్ రాజారెడ్డి సతీమణి వైయస్ జయమ్మ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ పులివెందులలోని వైఎస్ జయమ్మ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ జయమ్మ 18 వ వర్ధంతి సందర్భంగా ఆమె పులివెందులకు చేరుకొని పులివెందులలోని జయమ్మ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం సమాధి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వైఎస్ జయమ్మ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆమె వెంట మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి వైయస్ సౌభాగ్యమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతి, వై ఎస్ వివేకానంద రెడ్డి బావమరిది శివ ప్రకాష్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పాల్గొన్నారు.
Tag:
ys vijayamma
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను సీఎం జగన్, వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. వారితోపాటు ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటి సీఎం అంజాద్ బాషా, మంత్రి అదిమూలపు సురేష్ కార్యక్రమానికి హాజరైయ్యారు. సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also..
Read Also..





Total views : 79528