ఎన్నికల సమీస్తున్న తరుణంలో నేతల మాటల తూటల కన్నా… ఫ్లెక్సీల రగడే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మరొకసారి ఫ్లెక్సీల వార్ మొదలైంది. తాడిపత్రికి నారా లోకేష్ వస్తున్న తరుణంలో టిడిపి నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బస్టాండ్ ఆవరణ నుంచి కడప రోడ్ వరకు కట్టిన ఫ్లెక్సీలను అర్ధరాత్రి సమయంలోగుర్తు తెలియని వ్యక్తులు వాటిని చింపి వేశారు. ఇది గమనించిన టిడిపి నాయకులు సరౌండింగ్ లో ఉన్న సీసీ కెమెరాలు ఉన్నచోట ఆరా తీయగా, సీసీ కెమెరాలకు చేయి అడ్డంపెట్టి ఫ్లెక్సీలను చింపేసినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఇటువంటి పరిస్థితి నెలకొనడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే … సిబ్బంది పట్టించుకోలేదని వాపోతున్నారు.
ysrcp
మార్చి 14వ తేదీ ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో జరిగే కిసాన్ మోర్చా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు రామానాయుడు పిలుపునిచ్చారు. అదే విధంగా రైతు సంఘాల పోరాటానికి, ప్రజాసంఘాలు మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను తిరుచానూరు బైపాస్ లోని యోగి మల్లవరం బ్రిడ్జి దగ్గర ప్రజాసంఘాల నాయకులు ఆధ్వర్యంలో కర పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలోని పెద్ద ఎత్తున రైతు పోరాటం నిర్వహించడం జరిగిందని, ఆ పోరాటానికి దేశవ్యాప్తంగా కార్మిక మధ్య పేద తరగతి మద్దతు తెలపడంతో కేంద్ర ప్రభుత్వం. తలవంచిందని చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేనకు, బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి నగర అధ్యక్షులు కేవైసీ రాజా ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణ సమీపంలో నివాసానికి యోగ్యంగా ఉన్న అత్యంత విలువైన (రూ.5 కోట్లు) సొంత భూమిని వైసీసీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఫయాజ్ భాష పేదలకు పంచిపెట్టాడు. శనివారం నిర్వహించిన ఈ శుభ కార్యాన్ని వైసీపీ జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతుల మీదుగా లబ్దిదారుల కు అందించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ ఏ మాత్రం స్వార్ధం లేకుండా సొంత నిధులతో 232 మందికి 1.25 సెంట్ల చొప్పున స్థలాలు ఇవ్వడం చాల గొప్ప విషయం అన్నారు. ఫయాజ్ భాష సల్లంగుండేలా ప్రతి రోజు ప్రార్ధనలు నిర్వహించాలని హజరైన ముస్లిం సోదర సోదరీ మణులను కోరారు. అనంతరం ఫయాజ్ భాష మాట్లాడుతూ తానేదో ఆశించి ఈ కార్యక్రమం నిర్వహించడం లేదని వివరించాడు. ఫయాజ్ బాషా ట్రస్టు ద్వారా తాను చేస్తున్న” సేవాకార్యక్రమాలు స్థానిక ప్రజలకు తెలియంది కాదన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగానే స్థలం లేని పేదవారికి ఇళ్ల పట్టాలను అందిస్తున్నానన్నారు. అవకాశం కల్పించిన అల్లాకు రుణపడి ఉంటానని తెలిపారు. వైసీపీ పార్టీతోనే మైనార్టీల అభివృద్ధి సాధ్య పడుతుందని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఫయాజ్ భాష అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో ముస్లిం మేతరుడు పల్లె రఘునాథరెడ్డికి వక్ఫ్ బోర్డు మినిస్టర్ గా పదవి ఇచ్చి ముస్లిం మైనార్టీలను అగౌరపరచాడన్నారు. ముస్లిం మైనార్టీల సమస్యలు ఆయనకు వద్ద చెప్పుకోలేక మత పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడిన సంఘటనలు ఉన్నాయన్నారు. రెండు సంవత్సరాల తరువాత చంద్రబాబే ఆ పదవి తన వద్ద ఉంచుకున్నాడన్నారు. ఆయన అపాయింటమెంట్ దొరకక మరో రకంగా ముస్లిం మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారని ఆవేదన చెందారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముస్లిం మైనార్టీ నాయకుడు అంజాద్ ఖాన్ ను ఉప ముఖ్యమంత్రిగా చేసి మైనార్టీల అభివృద్ధికి పాటు పడ్డాడన్నారు. దేశంలోనే పార్టీలకు, మతాలకు అతీతంగా పారదర్శకంగా సంక్షేమాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. మైనార్టీలంతా ఏ పార్టీలో తమకు మంచి జరిగిందో ఆలోచించుకోవాలన్నారు. మైనార్టీలకు సముచిత స్థానం కల్పించిన వైసీపీ కా, అగౌరపరచిన టీడీపీ పార్టీకా అన్నది గుర్తుంచుకోవాలంటూ సమావేశాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి పేరం స్వర్ణలతా రెడ్డి, రమేష్ రెడ్డి, అనంతపురం పార్లమెంటరీ అభ్యర్థి శంకరనారాయణ, తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఇళ్ల పట్టాల లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో సుమారుగా 200 మంది వైసీపీ పార్టీ కు చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. పంతం నానాజీ జనాసేన పార్టీ కండువాలు వేసి జనసేన పార్టీలో ఆహ్వానించారు. పంతం నానాజీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వలనే రాష్ట్రంలో సంక్షేమం ,సుపరిపాలన సాధ్యమని ప్రజలు గ్రహించారు అని అన్నారు. ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు కర్రేడ్ల గోవింద్, తడాల అబ్బు, కుర్ర నాగేశ్వరరావు, పుల్ల శ్రీరాములు, మాదరపు తాతాజీ, సిరంగు శ్రీనివాసరావు, తాటికాయలు వీరబాబు, సోదే ముసలయ్య జనసేన కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) :
రెండేళ్ళు కరోనా వచ్చినప్పటికీ జగనన్న చేసిన సంక్షేమ పరిపాలన ఎవ్వరు కుడా చేయలేదు. ఈ ఐదేండ్లు మీ అందరి గడప గడపను సందర్శించి మీ కష్ట సుఖాలను తెలుసుకొన్నా.. రాయచోటి ని జిల్లా కేంద్రంగా తీసుకురావడంతో పాటు అర్హులైన వారందరికి జగనన్న సంక్షేమ ఫలాలను అందించాం.. మీరు ఒక సారి దీవిస్తే దీనికి రెట్టింపుగా అభివృద్ధి చేస్తా.. ఒక రోజు నన్ను మీరు ఆశిర్వదిస్తే మీ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి ఐదేండ్లు మీ కాళ్ళ కింద పని చేస్తానని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గురిగింజ కుంట, సంబేపల్లి గ్రామలల్లో సుమారు కోటి కి పైగా నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్ తో పాటు పొన్నెళ్ళ వాండ్ల పల్లే తారు రోడ్డును ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే కి స్థానిక వైకాపా ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు కుటుంబ సభ్యులు గజమాలతో స్వాగతం పలికారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తారు రోడ్డు ప్రారంభించే ముందు దివంగత నేత వైఎస్సార్ విహ్రహానికి పూలమాల వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సులు రెడ్డి తదితరులతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో రైతుల ముంగిటకు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా ఉన్న రైతు భరోసా కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకొని సేవలను పొందాలని కోరారు. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలను, మందులను అందించడం జరుగుతొందన్నారు. అంతేకాక గ్రామాల్లో వ్యవసాయ అధికారులు, సిబ్బంది అందుబాటులో వుండి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలతోపాటు అవసరమైన ఇతర సేవలను అందించడం జరుగుతొందన్నారు.
ఇది చదవండి : మహిళలు పురుషులకన్నా శక్తివంతులు- నారా బ్రాహ్మణి
రైతు భరోసా కేంద్రం రైతులకు ఒక దేవాలయంలా ఉందన్నారు. వైద్యరంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సంబేపల్లె మండలం గురిగింజ కుంట లో విలేజ్ క్లినిక్ నూతన భవనం ప్రారంభంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు గ్రామంలోనే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రతి 2500 జనాభాకు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లును నియమించారన్నారు. ఈ క్లినిక్ లో 12 రకాల వైద్య సేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. 65 రకాల మందులతో పాటు 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్ మెంట్ అందుబాటులో ఉంటుందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటి వద్దకే నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి గొర్ల ఉపేంద్రా రెడ్డి, డీసీసిబి డైరెక్టర్ సేఠ్ వెంకట్రామి రెడ్డి, ఎం పి టి సి కేతి రెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ లు రఘునాధ రెడ్డి, దండు భూషణ్ రెడ్డి, జిల్లా జె సి ఎస్ కన్వీనర్ అమర నాధ రెడ్డి, వైకాప నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ LM మోహన్ రెడ్డి ఆయన కుమారుడు LM విష్ణువర్ధన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు దొడగట్ట రోడ్డులోని బైపాస్ క్రాస్ వద్ద ఏర్పాటు చేశారు. వీటిని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సగానికి కోసేశారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. మోహన్ రెడ్డి రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేని వారు ఎవరైనా ఇలా చేశారా? అనే కోణంలో చర్చ జరుగుతుంది. బీసీ ఈక్వేషన్ కింద తలారి రంగయ్య కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగిపోయింది. పార్టీ మరో ఆలోచన చేసి ఉంటే మోహన్ రెడ్డికే స్థానికంగా ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు తొలగించడాన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని దుండగులను గుర్తించే పనిలో వైసీపీ నిమగ్నమైంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: జోతిర్లింగాన్ని దర్శించుకున్న గోపీచంద్..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
అంబటి రాంబాబు (Ambati Rambabu) :
సత్తెనపల్లిలో అంబటి రాంబాబు (Ambati Rambabu) ఏది చేసినా సంచలనమే. ఆయన నిత్యం ఏదో రకంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. వినూత్నంగా ఆలోచిస్తూ సరికొత్తగా కార్యాచరణతో ముందుకు సాగుతుంటారు. ఇటీవల బుల్లెట్ వాహనంపై పర్యటిస్తూ, స్థానికులను పలకరిస్తూ, కార్యకర్తలను పరామర్శిస్తూ, ప్రధాన కూడళ్లలో నేతలతో భేటీ అవుతున్నారు. ఆర్భాటాలకు దూరంగా, సహజంగా, సౌలభ్యంగా ఉండేందుకు ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనం పై గ్రామాలలో పర్యటిస్తూ వైఎస్ఆర్సిపి శ్రేణుల్లో నయా జోష్ ను నింపుతున్నారు రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు. కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు కాన్వాయిని సహితం విడిచి కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు ద్విచక్ర వాహనాలతో తరలి వెళ్తున్నారు. దీంతో యువకులు, నాయకులు ఆయన వెంట భారీగా హాజరవుతున్నారు. కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో సరికొత్త సందడిని తీసుకొస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
గతంలో పట్టణం, మాదల, లంకెలకూరపాడు, భీమవరం గ్రామాల్లో పర్యటనతో స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. సరికొత్త ట్రెండును సృష్టిస్తున్న అంబటికి పల్లెల్లో జనం నిరాజనం పలుకుతున్నారు. ఎన్నికల సమీపిస్తుండటతో పట్టణంలోని కీలక నేతలను పరామర్శించడం, పలకరించడం చేశారు, ఇదే కోవలో కొందరు వైద్యులను, ఇతర ప్రభావితం చేయగల వ్యక్తులను ఆయన కలుస్తున్నారు. గ్రామాలలోని వర్గ విభేదాలు, నాయకత్వ లోపాలు ఉన్నచోట సర్ది చెప్పి ఒక తాటిపై తీసుకొచ్చారు. దానికి పెద్ద మక్కిన గ్రామమే మంచి ఉదాహరణ. ఇలా అనేక కీలక అంశాలలో ఆయన అంతర్గతంగా వేగం పెంచారు. నేడు 500 బైకులతో భారీ ర్యాలీ రూరల్ మండలంలోని కీలకమైన పది గ్రామాలను ద్విచక్ర వాహనాలతో చుట్టి వచ్చేలా అంబటి ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా గ్రామాలలో స్థానిక అంశాలపై చర్చించడం, రానున్న ఎన్నికలకు సన్నద్ధం చేయడం, మండలంలో వైయస్సార్సీపి నేతల్లో ఎన్నికల జోషిని నింపడమే లక్ష్యంగా ఆయన సాగుతున్నారు. ఏడవ తేదీ ఉదయం రామకృష్టాపురం, నందిగం, గుడిపూడి, లక్ష్మీపురం, ఫణిదం, భట్లూరు, కట్టమూరు, దీపాలదిన్నెపాలెం, అబ్బూరు, గండ్లూరు గ్రామాలలో మంత్రి ద్విచక్ర వాహన ర్యాలీగా పర్యటన జరగనుంది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి : హిందూపురం శంఖారావం యాత్రకు విచ్చేసిన లోకేష్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ సమావేశం రసాభాస గా సాగింది. ముందుగా మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా మున్సిపల్ నిధులపై టిడిపి కౌన్సిలర్ దయసాగర్, వైసిపి కౌన్సిలర్ వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్ మధ్య మాటల యుద్ధం సాగింది. టీడీపీ కౌన్సిలర్ దయసాగర్ మాట్లాడుతూ మున్సిపల్ నిధుల్లో నాలుగు కోట్లు నిధులు ఉండగ వాటిని ఇష్టానుసారంగా వాడడంతో ప్రస్తుతం నిధులు లేకపోగా మున్సిపల్ స్టేషనరీ, వాటర్ క్యాన్లు కొనే పరిస్థితిలో కూడా మున్సిపాలిటీ లేకపోవడం దారుణం అన్నారు. ఆ నిధులన్ని ఎక్కడికి వెళ్లాయి అంటూ మున్సిపల్ కమిషనర్ ను అడగగా దానికి వైస్ చైర్మన్ నజీరామత్ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలను సాగాయి దీంతో మున్సిపల్ చైర్మన్ రఘు బెల్ కొట్టి సమావేశాన్ని ముగించారు. దింతో కౌన్సిల్ సమావేశంలో ప్రతిసారి టిడిపి కౌన్సిలర్లు మాట్లాడాలని అనుకున్న వైసిపి కౌన్సిలర్లు అడ్డుపడుతున్నారని, వారి వైఖరిని నిరసిస్తూ కౌన్సిల్ సమావేశంలోనే నేలపై బైఠాయించి అజెండా కాపీలను చింపుతూ టీడీపీ కౌన్సిలర్ లు నిరసన వ్యక్తం చేశారు.
పల్నాడు(Palnadu) జిల్లా, ముప్పాళ్ళ మండలం లంకెలకూరపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. రూ.36 లక్షలతో ఆరోగ్య ఉప కేంద్రం, 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన రూ.43.90 లక్షల గోదాములను, శిలాఫలకాలను ఆవిష్కరించిన మంత్రి అంబటి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భం గా మంత్రి అంబటి మాట్లాడుతూ…
పార్టీలు మారిన విశ్వాస ఘాతకులను ఓడించండి. జగనన్నకు విధేయులను ఆశీర్వదించండి. జగనన్న నొక్కే సంక్షేమ బటన్ కు వివక్షత లేదు. పొదుపు సభ్యులకు ఆసరా చెల్లించే ఎన్నికలకు వెళ్తాం. కులాలు, వర్గాలు రాజకీయాలకు అతీతంగా పారదర్శక సంక్షేమ పాలన అందించాము. సత్తెనపల్లిలో నాపై, నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ లపై పోటీ చేస్తున్న వాళ్లు స్వార్థంతో పార్టీలు మారారు. విశ్వాసఘాతుకులను వారిని గెలిపించడం ధర్మమేనా?జగనన్నకు విధేయులుగా ఉన్న మమ్మల్ని ఆశీర్వదించాలి.
ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే- అంబటి(Ambati Rambabu)
గత ఎన్నికల హాయంలో చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను ఇచ్చి డ్వాక్రా, రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసారు. 48 నెలలుగా జగనన్న అందిస్తున్న సంక్షేమ పరిపాలనను గతంలో చంద్రబాబునాయుడు చేసిన పరిపాలనకు బేరీజు వేసుకొని ఆశీర్వదించాలి. లంకెలకూరపాడు గ్రామంలో గత ఎన్నికల్లో 1100 పైగా మెజార్టీ వచ్చిందని ఈసారి అంతకు మించిన మెజార్టీ రావాలి. ఇది వైఎస్ఆర్ సీపీకి కంచుకోటని నాయకులు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలి అని తెలిపారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ప్రత్తిపాడులో నియెజకవర్గ స్థాయి వైసీపీ పార్టీ సిద్ధం సభను స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా mlc అనంత ఉదయ భాస్కర్, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్, జోనల్ వింగ్ యువత అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ లు హాజరయ్యారు. ఈ సిద్ధం సభకు నాలుగు మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు వేలాది సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్టంలో వైసీపీ పార్టీని 175 నియెజకవర్గాలలో గెలుపొందే దిశగా ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితులు లో రాష్ట్ర ప్రజలు లేరని అన్నారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ ను ప్రత్తిపాడు నియెజకవర్గములో వరుపుల సుబ్బారావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి తోనే రాష్ట్రంలో ప్రజలకు మచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.