అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం శ్రీరాముని అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జనవరి 22వ తేదీన జరగనున్న నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు దేశమంతటా అయోధ్య రామ మందిరం నుండి తీసుకొచ్చిన అక్షింతలు, అయోధ్య రామ మందిరం యొక్క రాముడు చిత్రపటం, కరపత్రం మొదలగునవి దేశమంతటా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి చేరే విధంగా పంచనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఈరోజు పి గన్నవరం వైనతేయ గోదావరి నది ఒడ్డున వెలసిన శ్రీ పట్టాభి రామచంద్రస్వామి ఆలయం వద్ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు సమావేశమై కోనసీమ జిల్లా అంతా శ్రీరామ చంద్ర స్వామి వారి అక్షింతలు, చిత్రపటం మొదలుగునవి జనవరి ఒకటి నుండి ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. జనవరి 22వ తేదీన స్వామివారి ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో దేశమంతటా ఉన్న దేవాలయాలలో భజనలు, కళ్యాణాలు, హోమాలు, క్రతువులు చేయమని చెప్పడం జరుగుతుందని అదేవిధంగా ఆరోజు సాయంత్రం దేశంలో ఉన్న ప్రతి ఇంటి వద్ద తక్కువలో తక్కువగా కనీసం ఐదు దీపాలు వెలిగించాలని ప్రతి ఇంటికి చెప్పడం జరుగుతుందని అన్నారు. ఆ విధంగా జనవరి 22వ తేదీన ప్రతి ఇంటి వద్ద దీపాలను వెలిగించి 500 ఏళ్ల తర్వాత ప్రతి ఇంటి వద్ద ఆనందం వెళ్లి విరిసి మన హిందువుల కలలను సహకారం చేసుకోవాలని అన్నారు.
Tag:




Total views : 78385