సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 5 నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించారు సీఎం కేసీఆర్. నేడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. పట్టణ శివారులో నిర్వహించే సభకు సుమారు లక్ష మంది జనం వస్తారని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి తెలిపారు. సభావేదికతో పాటు నాయకులు, కార్యకర్తల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్ మొత్తం గులాబీమయంగా మారిందని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరూ లేరని సైది రెడ్డిఅన్నారు.
Nalgonda
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుండి కోదాడ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ వెళ్లనున్నారు. 1:40 నిమిషాలకి కోదాడకు కేసీఆర్ చేరుకోనున్నారు. 1:50 నిమిషాలకి ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణంకు చేరుకొని సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 2.30 నిమిషాలకు కోదాడ నుండి తుంగతుర్తి వెళ్లనునారు. 3:10 నిమిషాలకు తుంగతుర్తి చేరుకొని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 3:50 నిమిషాలకి ఆలేరు నియోజక వర్గ ప్రజా ఆశీర్వాదా సభకు బయల్దేరి వెళ్లనున్నారు. 4:10 నిమిషాలకు ఆలేరు చేరుకొని, 4:20 నిమిషాలకు ఆలేరు నియోజకవర్గ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆలేరు సభ అనంతరం తిరిగి హైదరాబాద్ కి తిరిగి వెళ్లనున్నారు.
నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను గోరెంట్ల గ్రామస్తులు అడ్డుకున్నారు. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో గాదరి కిషోర్ ప్రచారం చేశారు. అయితే అభివృద్ది ఎక్కడంటూ గ్రామస్ధులు అడ్డుకుని ప్రశ్నించారు. ప్రచారం కోసం వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడి చేశారు. అనంతరం అక్కడకు చేరుకున్నా పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాయకులకే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే గ్రామస్తులపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామస్థులపై ఉంటే ఉండండి…లేకపోతే వెళ్లిపోండంటూ విరుచుకుపడ్డారు. తనను అడగాల్సింది సభలోనని…ఇదేమీ సభ కాదని అన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావు కలిసి చెరుకు సుధాకర్కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య, గాయకుడు ఏపూరి సోమన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.





Total views : 81812