Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Telangana బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బహిరంగ ఆరోపణలు..

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బహిరంగ ఆరోపణలు..

by Satya
BJP and Congress

కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండిలోని ఇరిగేషన్ కార్యాలయంలో కాళేశ్వరం, మెడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బ్లాక్ వన్ బ్లాక్ టు ఆఫీసుల్లో ఉన్న ఫైల్స్ ను తనిఖీలు చేశారు. అకస్మాత్తుగా ఎల్ఎండి లో ఎస్సారెస్పీ ఆఫీసులకు సంబంధించి తనిఖీలు చేస్తుండడంతో చుట్టుపక్కల పరిణామాలు ఉత్కంఠగా మారింది. తనిఖీల తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు ఎస్పీ రమణారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ బహిరంగ ఆరోపణలు చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఈ తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: