Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Latest News ఈనెల 23న యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

ఈనెల 23న యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

by CVR NEWS
ఈనెల 23న యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమైంది. ఈనెల 23న యాదగిరిగుట్టలో వంద కోట్ల రూపాయల భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పనులకు భూమిపూజ చేయనున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబోతోంది.
టెంపుల్ సిటీపై వేద పాఠశాల, ఆలయ కొండపై నిత్యాకళ్యాణ మండపం, దీక్షాపరుల భవనంతో పాటు భక్తుల సౌకర్యార్థం మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. అంతకంటే ముందే, ఈనెల 22నే కంచి పీఠాధిపతి యాదగిరిగుట్టకు చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆ రోజు సాయంత్రం కంచి పీఠాధిపతి ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక భజన కార్యక్రమం, అనుగ్రహ భాషణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు. శంకుస్థాపన నేపథ్యంలో భక్తులు, స్థానికులు ఆలయ అధికారులకు, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisements

You may also like

Our Visitor

039518
Total views : 197687

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: