Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Latest News భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

by CVR NEWS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన

పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు, ముంపు పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించారు.ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమైన సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యులు ముంపు ప్రాంతాల వివరాలు, పునరావాస చర్యలు, రక్షణ పనులపై ఆరా తీశారు.ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

020000
Total views : 92037

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.