Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh తిరుచానూరులో ట్రాఫిక్ ఆంక్షలు వాహనాల మళ్లింపు..

తిరుచానూరులో ట్రాఫిక్ ఆంక్షలు వాహనాల మళ్లింపు..

by Prakash
Traffic restrictions

శనివారం తిరుచానూరు వైపు వెళ్ళే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు అమలులో ఉంటుంది. శుక్రవారము రాత్రి 12:00 గంటల నుండి సింధు కూడలి నుంచి తిరుచానూరు లోపలికి ఎటువంటి వాహనాలు అనుమతిలేదు. అప్పటి నుండి ట్రాఫిక్ మళ్ళింపు అమలులో ఉంటుంది. దయచేసి స్థానిక ప్రజలు గమనించగలరు. శనివారం ఉదయం అమ్మవారి పంచమి చక్ర స్నానం పూర్తి అయ్యేవరకు తిరుచానూరు నుండి బయట వైపు మరియు లోపలికి వైపుకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. 18-11-2023 శనివారం ఉదయం జరిగే పంచమి తీర్థానికి వచ్చే ప్రతి ఒక్కరు ప్రత్యేకము గా ఏర్పాటు చేసిన మూడు హోల్డింగ్ పాయింట్స్

  1. పూడి,
  2. Z.P.High School
  3. నవజీవన్ హోల్డింగ్ పాయింట్ ల నుండి క్యూలైన్ల ద్వారా 4 వ గేటు నుండి మాత్రమే పుష్కరిణి లోనికి ప్రవేశం కల్పించడం జరుగుతుంది

పంచమితీర్థం కు తిరుపతి నుండి వచ్చే భక్తులు తమ నాలుగు చక్రాల వాహనాలను మార్కెట్ యార్డ్, తనపల్లి క్రాస్ నందు, ద్విచక్ర వాహనాలు శిల్పారామం, వార్తా క్రాస్ వద్ద గల పార్కింగ్ నందు పార్క్ చేసి అక్కడ నుండి నవజీవన్ వద్ద ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్ కు చేరుకోవాలి. తమిళనాడు నుండి పూడి మీదుగా వచ్చే భక్తులు పాడిపేట వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియాలో వారి వాహనాలను ఉంచి కాలినడకన గోశాల వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్ ద్వారా పుష్కరిణిలోనికి చేరవల్సి ఉంటుంది. నారాయణాద్రి ఆసుపత్రి, గాజులమండ్యం మరియు రేణిగుంట వైపు నుండి వచ్చే భక్తులు వార్త క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాలను ఉంచి కాలినడకన నవజీవన్ వద్దనున్న హోల్డింగ్ పాయింట్ కు చేరుకోవాలి. చిత్తూరు వైపు నుండి వచ్చే భక్తులు తనపల్లి క్రాస్ వద్దనున్న హోటల్ తాజ్ ఎదురుగా ఉన్న గల పార్కింగ్ ఏరియాలో వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకన నవజీవన్ వద్దనున్న హోల్డింగ్ పాయింట్ కు చేరుకోవాలి. పూడి రోడ్డు మార్గం వైపు గల అన్ని గ్రామాల ప్రజలు మరియు ఆ దారిలో వచ్చిన వాహన దారులు పాడిపేట పెట్రోల్ బంక్ కు ఎడమ వైపు నుండి ముండ్లపూడి గ్రామం మీదుగా తనపల్లి గ్రామం కు చేరుకుని, అక్కడి నుండి తాజ్ హోటల్ మార్గం గుండా తిరుపతికి చేరుకోవాలి అలాగే తిరుపతి నుండి పూడి మార్గం వైపు వెళ్లే ప్రజలు పై విధంగానే వెళ్లాల్సి ఉంటుంది. యోగిమల్లవరం, ముత్తునగర్, ప్రశాంతి నగర్, ఎస్వీపి కాలనీ,వసుంధర నగర్, వైష్ణవి నగర్, పొన్నకాల్వ, చంద్రశేఖర్ కాలనీ ప్రజలు తాజ్ హోటల్ మార్గం ద్వారా బైపాస్ రోడ్డుకు చేరుకుని అక్కడి నుండి తిరుపతి వైపుకు చేరుకోవాలి. నేతాజీనగర్, రంగనాధం వీధి, కుంటిగంగమ్మ వీధి, సమాజం వీధి, సన్నిధివీధి, శంకర్ నాయుడు కాలనీ వాసులు వార్త క్రాస్ ద్వారా తిరుపతికి చేరుకోవాలి. చక్రస్నానం పూర్తయ్యేంత వరకు సింధూ జంక్షన్ నుండి తిరుచానూరు కు, తిరుచానూరు నుండి పూడికి ఎలాంటి వాహనాలను అనుమతించబడదు కావున 18వ తేదీ పంచమితీర్థం రోజున తిరుచానూరు ప్రజలు గ్రామంలో ఎలాంటి వాహనాల పై తిరగకుండా పోలీసు వారికి సహకరించ వలసినదిగా విజ్ఞప్తి. భక్తులకు ముఖ్యమైన గమనిక:- పుష్కర పుణ్య స్నానమునకు వచ్చు వారు విలువైన ఆభరణములు ధరించి రావొద్దు. మీ యొక్క విలువైన వస్తువులు,సెల్ ఫోన్ లను జాగ్రత్త గా ఉంచుకోవాలి. పిల్లలు, వృద్దులను తీసుకుని వచ్చు భక్తులు, వారిని జాగ్రత్త గా తోడుగా వుండాలి.

Read Also…

Advertisements

You may also like

Our Visitor

019169
Total views : 90052

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.