అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు.. 2 లక్షల రూపాయల వరకు రైతు పంట రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఒకే విడతలో మొత్తం 2 లక్షల రూపాయలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేళ్ల మధ్య కాలంలో తీసుకున్న 2లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది.క్రాఫ్ లోన్ మాఫీ చేయడానికి 31వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ అనుకునే విధంగా సాగు రంగాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. కొండలు, గుట్టలు, వెంచర్లకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అందించటానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీథర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సభ్యులుగా ఉంటారన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభలో చర్చించి.. నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- కేరళంలోని వయనాడ్లో పోస్టర్ల కలకలం.కేరళ సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం సీటు కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా..ఈ వ్యవహారంతో కేరళ కాంగ్రెస్ లో విభేదాలు పెరిగిపోతున్నాయి..ఈ నేపథ్యంలోనే రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకంగా వయనాడ్లో పోస్టర్లు వెలిశాయి. వయనాడ్ జిల్లా కాంగ్రెస్…
- దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్ కలుగుతుంది..సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని…
- పూణేలో కూలిన శిక్షణ విమానం..మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్కు గాయాలయ్యాయి. రెడ్బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
- సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల…
- విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 74872