Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News అన్నా క్యాంటీన్ ల ద్వారా పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం

అన్నా క్యాంటీన్ ల ద్వారా పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం

by Rama
అన్నా క్యాంటీన్ ల ద్వారా పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం

కాకినాడ జిల్లా జగ్గంపేట. స్థానిక కాకినాడ రోడ్ లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద టిడిపి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహన్ రావు బావ సామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్న క్యాంటీన్ ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం పేదవారికి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత సంవత్సర కాలం పైబడి జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఎన్నికల కోడ్ కారణంగా గత రెండు మాసాలుగా అన్న క్యాంటీన్ నిలుపుదల చేశామని మళ్లీ గతవారం ప్రారంభించి పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నామని టిడిపి ప్రభుత్వం ఏర్పడిన కారణంగా జగ్గంపేటలో అన్న క్యాంటీన్ శాంక్షన్ అయి ఉందని అదేవిధంగా గోకవరం కిర్లంపూడి గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంటామని ఐదు రూపాయలకే అన్నం పెట్టి పేదవారి ఆకలి తీరుస్తామని అన్నారు. అన్నఎన్టీఆర్ ఆశయం ప్రతి పేదవాడు కడుపునిండా అన్నం తినాలని కోరుకునేవారని దానిని నిజం చేస్తూ చంద్రబాబు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారని అన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039248
Total views : 194955

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: