Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Latest News అన్నా క్యాంటీన్ ల ద్వారా పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం

అన్నా క్యాంటీన్ ల ద్వారా పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం

by Rama
అన్నా క్యాంటీన్ ల ద్వారా పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం

కాకినాడ జిల్లా జగ్గంపేట. స్థానిక కాకినాడ రోడ్ లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద టిడిపి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహన్ రావు బావ సామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్న క్యాంటీన్ ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం పేదవారికి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత సంవత్సర కాలం పైబడి జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఎన్నికల కోడ్ కారణంగా గత రెండు మాసాలుగా అన్న క్యాంటీన్ నిలుపుదల చేశామని మళ్లీ గతవారం ప్రారంభించి పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నామని టిడిపి ప్రభుత్వం ఏర్పడిన కారణంగా జగ్గంపేటలో అన్న క్యాంటీన్ శాంక్షన్ అయి ఉందని అదేవిధంగా గోకవరం కిర్లంపూడి గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంటామని ఐదు రూపాయలకే అన్నం పెట్టి పేదవారి ఆకలి తీరుస్తామని అన్నారు. అన్నఎన్టీఆర్ ఆశయం ప్రతి పేదవాడు కడుపునిండా అన్నం తినాలని కోరుకునేవారని దానిని నిజం చేస్తూ చంద్రబాబు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారని అన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: