Sunday, April 26, 2026
News Navigation
Sunday, April 26, 2026
News Navigation

Breaking

Sunday, April 26, 2026
Home International చంద్రయాన్-3 కారణంగా చంద్రుని ఉపరితలంపై గుంత..

చంద్రయాన్-3 కారణంగా చంద్రుని ఉపరితలంపై గుంత..

by Rama
Chandrayan-3

భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ 2023, ఆగస్టు 23న చంద్రునిపై విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేయడం భారతదేశానికి ఇదే మొదటిసారి. ఇప్పటివరకు కేవలం మూడు ఇతర దేశాలు మాత్రమే ఈ ఘనతను సాధించగలిగాయి. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపైకి ప్రజ్ఞాన్ రోవర్‌ను తీసుకువెళ్లింది. ఈ రోవర్‌ జాబిల్లిపై వివిధ సైంటిఫిక్ ఎక్స్‌పరిమెంట్స్‌ చేసింది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టే సమయంలో ల్యాండర్ చుట్టూ ‘ఎజెక్టా హాలో’ఏర్పడింది. అంటే ల్యాండర్ దిగిన ప్రదేశంలో గోతి ఏర్పడి, అక్కడి మట్టి పక్కకు జరిగింది. ఇది శాస్త్రవేత్తల్లో చాలా ఆసక్తిని రేపింది. ల్యాండింగ్ సైట్ చుట్టూ దుమ్ము, ధూళి బలంగా ఎగిరిపోయి అయిపోయి హాలో-షేప్డ్ పాటర్న్ ఏర్పడడాన్ని ఎజెక్టా హాలో అంటారు. విక్రమ్ ల్యాండర్ విషయానికొస్తే.. ఇక్కడ ల్యాండింగ్ ప్రభావం చంద్రుని పదార్థంలో కొంత భాగాన్ని విసిరేసి సమీపంలోని ప్రాంతంలో చెల్లాచెదురుగా చేసింది. జాబిల్లిపై ఉన్న ఈ మెటీరియల్‌ను ఎపి రెగోలిత్ అంటారు, ఇది చంద్రుని క్రస్ట్ పై పొర. ఇందులో రాళ్ళు, ధూళి ఉంటాయి. దీనిని మూన్ డస్ట్ అని కూడా పిలుస్తారు.

Advertisements

You may also like

Our Visitor

008333
Total views : 54791

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.