తెలంగాణ రాష్ట్రంలో జరగనునున్న ఎన్నికల నేపధ్యంలో జోరందుకున్న ప్రచారాలు, బహిరంగ సభలు. (AIMIM)పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ అభ్యర్థులతో కలిసి పాదయాత్రలలో, బహిరంగ సభలలో తీరిక లేకుండా పాల్గొంటూ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రియాసత్ నగర్ ప్రాంతంలో జరిగిన ఎం ఐ ఎం పార్టీ బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అందరి కంటే ఎక్కువ మెజారిటీతో అక్బరుద్దీన్ ఓవైసీ గెలుస్తారాని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, mim పార్టీకి ఓటు వేసి తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసితో పాటు చంద్రాయనగుట్ట సిట్టింగ్ ఎమ్మెల్యే మరియు AIMIM పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ, చంద్రాయనగుట్ట నియోజకవర్గ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
చాంద్రాయణగుట్టలో ఎంఐఎం పార్టీ బహిరంగ సభ..
285
previous post




Total views : 79968