Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News చైనా వైఖరిని నిరసిస్తూ తేజు పట్టణంలో విద్యార్థులు నిరసన

చైనా వైఖరిని నిరసిస్తూ తేజు పట్టణంలో విద్యార్థులు నిరసన

by Satya
china and arunachal pradesh

చైనా వైఖరి పట్ల అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు రగిలిపోతున్నారు. ఏషియన్ గేమ్స్ 2023 ను చైనా నిర్వహిస్తుండడం తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ నుంచి హాజరు కావాల్సిన భారత అథ్లెట్ల విషయంలో చైనా ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం వివాదానికి దారితీసింది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అథ్లెట్లు నైమన్ వాంగ్సు, ఒనిలు తేగ, మెపంగ్ లమ్గ్ ఏషియన్ గేమ్స్ లో పాల్గొనాల్సి ఉంది. వీరిలో ఇద్దరికి స్టాపుల్డ్ వీసాలను చైనా మంజూరు చేసింది. వీరికి అక్రెడిటేషన్ ఇవ్వలేదు. మరో అధ్లెట్ కు అక్రిడిటేషన్ ఇచ్చింది. చైనా వైఖరికి నిరసనగా వీరు ముగ్గురూ ఏషియన్ గేమ్స్ కు దూరంగా ఉన్నారు.
ఈ క్రమంలో చైనా వైఖరిని నిరసిస్తూ తేజు పట్టణంలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో, ఆల్ అరుణాచల్ ప్రదేశ్ యూత్ ఆర్గనైజేషన్, స్థానిక విద్యార్థి సంఘాలు సంయుక్తంగా పట్టణంలో పెద్ద ర్యాలీ నిర్వహించాయి. పలు విద్యాలయాలకు చెందిన 300కు పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. క్లాక్ టవర్ నుంచి గాంధీ చౌక్ వరకు ఇది కొనసాగింది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మను నిరసనకారులు తగలబెట్టారు. ముగ్గురు అథ్లెట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

039160
Total views : 194516

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: