Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Telangana అమరవీరుల స్తూపానికి జ్యోతి ప్రజ్వలన చేసిన రెమా రాజేశ్వరి

అమరవీరుల స్తూపానికి జ్యోతి ప్రజ్వలన చేసిన రెమా రాజేశ్వరి

by Rama
Police Martyrs

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలుఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పాల్గొని పోలీసు సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసు అమరవీరుల స్తూపానికి జ్యోతి ప్రజ్వలన చేసి, నివాళులు అర్పించారు. అదేవిధంగా పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీస్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు అమరులను స్మరిస్తూ స్మృతి పరేడ్ నిర్వహించారు. పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ 1993 నుంచి ఇప్పటివరకు విధి నిర్వహణలో మరణించిన అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు.

Advertisements

You may also like

Our Visitor

027521
Total views : 152372

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.