రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ,ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్షన్ 4,000 కి పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. హామీ నిలబెట్టుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ 4,000 తో సహా ఏప్రిల్ నుండి ఇవ్వాల్సిన పెంచిన మొత్తంతో కలిపి 7,000 రూపాయలు అందించడంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ దారులకు 7,000 రూపాయలు అందించారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం లోని 9 వ వార్డు నందు, శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం, ఏర్పేడు మండలం మేర్లపాక, మేర్లపాక హరిజనవాడ, మన్నసముద్రం, తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు హరిజనవాడ గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ NDA కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మొదటి నెలలోనే ఒకే సారి 1,000 పెంచి 7,000 రూపాయలు అందిస్తున్నామని, గత ప్రభుత్వం విడతల వారీ అని మోసం చేసిందని, వెయ్యి రూపాయలు పెంచడానికి 5 సం.|| తీసుకుని ప్రజలను మోసం చేశారని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 91021