202
ప్రీమియం పెట్రోల్ ధర లీటర్కు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. అలాగే, బీపీసీఎల్ స్పీడ్, ఐవోసీఎల్ ఎక్స్పీ95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధరను పెంచాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటర్పై రూ.22 పెరిగింది. సాధారణ డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.





Total views : 79441