ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో వైసీపీపై అసంతృప్తి పెరగడం వల్లే.. ఆ పార్టీ నేతలు బస్సు యాత్ర చేయాలనుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్య నేతలు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు. వైసీపీ సామాజిక సాధికారత బస్సు యాత్రపై మండిపడ్డారు. రేపల్లెలో పదో తరగతి చదివే బీసీ విద్యార్థి దహనం చేసిన ఘటనపై ఒత్తిడి తేవాలని స్పష్టం చేశారు. నంద్యాలలో మైనార్టీ వ్యక్తి సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను వైసీపీకి గుర్తు చేయాలన్నారు. రద్దు చేసిన పథకాలపై సమాధానం చెప్పిన తర్వాతే వైకాపా బస్సు యాత్ర చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
రద్దు చేసిన పథకాలపై సమాధానం
353
previous post





Total views : 78235