Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Adilabaad రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన- జనక ప్రసాద్

రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన- జనక ప్రసాద్

by Prakash
intuc janak prasad

మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రైవేటీకరణను ప్రోత్సహించింది బిఆర్ఎస్ ప్రభుత్వమని పార్లమెంటులో 13 మంది ఎంపీలు సంతకం చేయగా ప్రైవేటీకరణ చేయడం జరిగిందని దానిలో బాల్క సుమన్ కూడా ఒక ఎంపీ అని ఈరోజు ప్రైవేటీకరణ ఆపామని వాక్యానించడం పలు ఆశ్చర్యానికి గురి చేస్తుందని బుధవారం ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి intuc యూనియన్ నాయకులు జనక ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….బాల్క సుమన్ కెసిఆర్ కు ఒక పాలేరుగా ఉంటూ ప్రజలను మభ్యపెడుతూ చెన్నూర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉంటూ నియంత పాలన సాగిస్తున్నాడని, కుటుంబ పాలన సాగుతుందని తెలిపారు. వీరి ఆధ్వర్యంలో భారీ చేరికలు జరగగా కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం intuc జనక్ ప్రసాద్ మాట్లాడుతూ…..సింగరేణిలో ఒక్క బొగ్గుభాయి కూడా తవ్వని అసమర్థ సీఎం కేసీఆర్ అని బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక 80000 మందికి ఉద్యోగాలు లేకుండా చేశారని పది అండర్ గ్రౌండ్ మైంన్ డ్లను ప్రారంభిస్తానని చెప్పి ఒక్క మైన్ కూడా తవ్వలేదని 20000 ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్క ఉద్యోగం కూడా ఇప్పియ్యలేదని ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయలేదని పేర్లు మార్పిడి చేస్తానని చేయలేదని ఒక భారతదేశంలో కాదు ఇండోనేషియా ఆస్ట్రేలియాల కూడామైన్స్ ఓపెన్ చేస్తానని చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చే లేదని చెప్పారు. ప్రజా ఆశీర్వాద సభలో మేము అధికారంలోకి వస్తే టాక్సీని రద్దు చేసి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పగా నువ్వు చేయాలనుకుంటే అధికార పార్టీ ముఖ్యమంత్రి గానే ఉన్నావు కదా రద్దు చేయాలని అనుకుంటే ఒక్క నిమిషం పని అని అన్నారు.తెలంగాణ వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువకులకు నిరాశ ఎదురయిందని రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారం చేపడితే పాత రోజులు వస్తాయని గడిల పాలన మొదలవుతుందని ప్రజలు బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు.ఇకనైనా సింగరేణి సమస్యలు నెరవేరాలంటే ఈ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ని గెలిపించుకోవాలని ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామిని గెలిపించి వారి తండ్రి అయిన వెంకటస్వామి ప్రజల కార్మికుల పక్షాన నిలబడి సమస్యలను పరిష్కరించారో అలాగే వివేక్ వెంకటస్వామి కూడా ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించేలా చూడవలసిన బాధ్యత ప్రజల పైనే ఉందని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నచో సమస్యలన్నీ నెరవేరుస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే విప్ నల్లాల ఓదెలు,కాంపెల్లి సమ్మయ్య,దేవి భూమయ్య, పాల్గొన్నరు

Advertisements

You may also like

Our Visitor

013746
Total views : 78029

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.