Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Telangana వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ దృవపత్రాల బాగోతం

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ దృవపత్రాల బాగోతం

by Rama
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ దృవపత్రాల బాగోతం

దక్షిణాకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ దృవపత్రాల బాగోతం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికవరకు కేవలం భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, లడ్డు తయారీలో నాణ్యత లోపం, శానిటేషన్ పై నిర్లక్ష్యం, బ్లాక్ లో టికెట్టు విక్రయం, సిబ్బంది చేతివాటం వంటి పలు విషయాల్లో వార్తలోకెక్కిన రాజన్న ఆలయం ఇప్పుడు ఏకంగా నకిలీ ధృవపత్రాల బాగోతంతో వార్తల నిలుస్తోంది. ఆలయంలో ఏ.ఈ.వోగా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పదోన్నతి పొందినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆలయాధికారులు సైతం సీనియర్లను కాదని, ఆయనకు పదోన్నతి కల్పించి, కీలక బాధ్యతలు అప్పగించినట్టు గత కొన్నేళ్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై గతంలోనే కొంతమంది ఉద్యోగులు దేవాదాయ శాఖ కమిషనర్ కు, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పప్పటికి సదరు ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈయనతో పాటు మరికొంత మంది ఉద్యోగులు, సిబ్బంది సైతం నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గత ప్రభుత్వం ఇలాంటి ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కనీసం నూతన కాంగ్రెస్ ప్రభుత్వమైన నకిలీలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని రాజన్న భక్తులు కోరుతున్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014746
Total views : 80981

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.