Friday, May 15, 2026
News Navigation
Friday, May 15, 2026
News Navigation

Breaking

Friday, May 15, 2026
Home Telangana ఓటు వేసే ముందు ఆగం కావొద్దు..

ఓటు వేసే ముందు ఆగం కావొద్దు..

by Rama
KCR

ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి కొంత‌మంది ప‌చ్చి అబద్దాలు చెబుతున్నారని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. వ‌ర్ధ‌న్న‌పేట రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ ఫూలింగ్ చేస్తార‌ని ప‌చ్చి అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తున్నారన్నారు. ఆరూరి ర‌మేశ్‌పై నేరుగా గెలిచే ద‌మ్ము లేనోళ్లు ఈ ప్ర‌చారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ల్యాండ్ పూలింగ్ చేయబోమని ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తున్నానన్నారు. వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్రంస‌గించారు. ఓటు వేసే ముందు ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి అని వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు. 160 కోట్ల‌తో వ‌ర్ధ‌న్న‌పేట ప‌ట్ట‌ణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామ‌ని కేసీఆర్ తెలిపారు. ఇవాళ కొంత మంది నాయ‌కులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఇపుడు ఓట్ల కోసం వస్తున్నవారికి తెలంగాణపై అవగాహన లేదన్నారు. ఆరూరి ర‌మేశ్ ఆధ్వ‌ర్యంలో వ‌ర్ధ‌న్న‌పేట అన్ని రంగాల్లో బ్ర‌హ్మాండ‌మైన అభివృద్ధి సాధించిందన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013530
Total views : 77727

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.