18
ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్ను మోసం చేసిన ఎస్సైపై కేసు నమోదైంది. హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సురేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 బ్యాచ్కు చెందిన సురేష్, పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో సన్నిహితంగా ఉన్నాడు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ ప్రారంభించగా..సురేష్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశాడు. బాధితురాలిచ్చిన ఆధారాలతో ఎస్సై సురేష్ను సస్పెండ్ చేశారు. ఇన్ని రోజులు పరారీలో ఉన్న సురేష్ను అరెస్ట్ చేశారు కూకట్పల్లి పోలీసులు.





Total views : 76666