Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh జగన్ ప్రభుత్వంలో డ్రైవర్ల పరిస్థితి దయనీయం – సవితమ్మ

జగన్ ప్రభుత్వంలో డ్రైవర్ల పరిస్థితి దయనీయం – సవితమ్మ

by Prakash
savithamma tdp

సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆటో డ్రైవర్లుతో చర్చిoచగా వైసీపీ ప్రభుత్వం లో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో ఆటో డ్రైవర్ల నుండి వెయ్యి రూపాయలు కొట్టేస్తున్నారని ,అధిక డీజిల్ ధరలతో ,రోడ్లు సరిగా లేక ఆటోలు రిపైర్లు రావడంతో కుటుంబ పోషణ గడవడం చాలా కష్టంగా ఉందని వాపోయారు, ఎన్నికల ముందు ఆటో డ్రైవర్ల జీవితాలు మార్చేస్తానన్న జగన్ ఇప్పుడు వాళ్ల పాలిట యముడి లా తయారు అయ్యారని డ్రైవర్లు వాపోయారు. అనంతరం సవితమ్మ మాట్లాడుతూ అసలే అంతంత మాత్రం బతుకులు, నిబంధనల పేరుతో అడుగడుగునా పోలీసుల వేధింపులు,ఆపై జరిమానాలు. పెట్రోలు, డీజిల్ ధర మంటలు నెల తిరిగే సరికి అప్పుల వారి ఒత్తిళ్లు ఇవీ ఆటో, క్యాబ్, ట్రక్కు డ్రైవర్ల కష్టాలు. వారి సంక్షేమాన్ని పట్టించుకునే స్థితిలో ఈ వైసిపి ప్రభుత్వం లేదన్నారు. గ్రామీణ ప్రాతాల్లో కనీసం ఓ కిలోమీటరైనా సరిగా లేని రొడ్లు.! ఆపై పొరపాటున ప్రమాదాలు జరిగినప్పుడు ఆటో డ్రైవర్లపై తీవ్ర భారంతో వారి కుటుంసభ్యులు కోలుకునేందుకు ఏళ్ల వ్యవధి పడుతోందనీ దీనికి తోడు కేసులతో పాటు జరిమానాలు చెల్లించి వాహనాలు నడపాల్సిన పరిస్థితి వస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డ సవితమ్మ. ఈ కార్యక్రమంలో మాధవ నాయుడు, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, గుట్టురు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, నల్లూరు మాజీ సర్పంచ్ గోపాల్, త్రివేంద్ర నాయుడు, బాబుల్ రెడ్డి, సనాఉల్లా బాలాజీ నాయక్, మారుతి ప్రసాద్, వాసుదేవరెడ్డి రాంపురం అంజి, మంజు, గోవిందప్ప, టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039479
Total views : 197052

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: