Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh వైసీపీ ఎమ్మెల్యే దొంగ ఓట్ల పై కలెక్టర్ కు ఫిర్యాదు..

వైసీపీ ఎమ్మెల్యే దొంగ ఓట్ల పై కలెక్టర్ కు ఫిర్యాదు..

by Prakash
tdp leaders

2024 ఎలక్షన్లో దొంగ ఓట్లతో మళ్లీ అధికారం కోసం వైసిపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, అదే విధంగా తిరుపతి జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్పించారని టిడిపి నాయకులు ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఇసుక , మఠం భూములు ,ఎర్రచందనం మాఫియా లాగా అధికారుల అండదండలతో దొంగ ఓట్ల మాఫియా చేశారని ఆరోపించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు సుగుణమ్మ, పులివర్తి నాని, నరసింహా యాదవ్ తో కలిసి దొంగ ఓట్లు పైన ఫిర్యాదు చేశారు .ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ రానున్న ఎలక్షన్ లో వైసీపీ దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు .ఇప్పటికైనా అధికారులు దొంగ ఓట్ల పైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు

Advertisements

You may also like

Our Visitor

039500
Total views : 197180

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: