Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana నాగార్జున సాగర్ ఘటన పై హరీష్ రావు

నాగార్జున సాగర్ ఘటన పై హరీష్ రావు

by Satya
Minister Harish Rao

నాగార్జున సాగర్ ఘటన పై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున తానేమి వ్యాఖ్యానించబోనని తెలిపారు. ఈ ఘటనపై ఎన్నికలు ముగిసిన తర్వాత కెసిఆర్ స్పందిస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పుడు సాగర్ ఘటనపై వ్యాఖ్యానించినట్లయితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారమవుతామని, అది తమకు ఇష్టం లేదన్నారు. ఇక ఓటింగ్ సరళి పార్టీకి అనుకూలంగా ఉందని, పట్టణ ప్రాంతంలో మరింత ఓటింగ్ శాతం పెరగాలని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఓటర్లు తనపట్ల సానుకూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఓటు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు.

Advertisements

You may also like

Our Visitor

014424
Total views : 80160

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.