Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshWest Godavari వశిష్ట గోదావరి వలందర్ రేవులో ప్రత్యేక పూజలు..

వశిష్ట గోదావరి వలందర్ రేవులో ప్రత్యేక పూజలు..

by Rama
valandhar revu

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో కార్తీకమాసం ఆఖరి సోమవారం కావడంతో నరసాపురం వశిష్ట గోదావరి వలందర్ రేవులో తెల్లవారుజాము నుండి వేలాది మంది భక్తులు పుణ్య స్థానాలు ఆచరించి గోదావరి నదిలో కార్తీకదీపాలను వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి సమీపంలోని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా పుణ్యఫలం పొందుకుంటామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో నరసాపురం పట్టణంలోని కపిల మల్లేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని లక్షదీపార్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రాకతో నరసాపురం వశిష్ట గోదావరి తీరం జన సందోహంగా మారింది. ప్రతి ఏటా కార్తీక మాసం సందర్భంగా ఈ వలందర్ రేవులో నిత్యం వేలాది మంది భక్తులు కార్తీకదీపాలను వదిలి పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. వశిష్ట ముని తపస్సు చేసిన ఈ ప్రాంతంలో కార్తీక మాసంలో పూజలు నిర్వహించడం ద్వారా ఆ పరమశివుడి అనుగ్రహం పొందుకుంటామని భక్తుల నమ్మకం భక్తజన సందోహంతో శివనామ స్మరణ మార్మోగింది.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014162
Total views : 79332

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.