ఆలోచనలు వెర్రితలలు వేస్తే అది విపరీత ధోరణి అనుకుంటాం. కానీ ఆ స్థాయిని కూడా దాటిపోతే దాన్ని ఏమనాలి? ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. తనతో సన్నిహితంగా ఉంటున్న యువకుడిపై మోజు పడిన వ్యక్తి ఆ యువకుడికి తెలియకుండానే లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించిన ఘటన వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ముజఫర్ నగర్ కు చెందిన 20 ఏళ్ల ముజాహిద్ అనే యువకుడు ఓం ప్రకాశ్ అనే వ్యక్తితో రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఇటీవల యువకుడు అనారోగ్యానికి గురికాగా తాను ఆసుపత్రికి తీసుకెళ్తానంటూ ఓం ప్రకాశ్ ను ఆ యువకుడిని మన్సూర్ పూర్ లోని ఓ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి డాక్టర్లు ముజాహిద్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఓ శస్త్రచికిత్స చేయాలని సూచించారు. నిజమేనని నమ్మిన యువకుడు శస్త్రచికిత్సకు సిద్దమయ్యారు.
అయితే, వైద్యులు ముజాహిద్ కు లింగ మార్పిడి చేశారు. మత్తు మందు కారణంగా తనకు ఎలాంటి శస్త్రచికిత్స నిర్వహించారో ఆ యువకుడు గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత ఓం ప్రకాశ్ వచ్చి ఇప్పుడు నువ్వు అమ్మాయిగా మారిపోయావు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, జీవితాంతం మనం కలిసే ఉండొచ్చు అని చెప్పాడు.
దాంతో దిగ్ర్భాంతికి గురైన ఆ యువకుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఓం ప్రకాశ్ ను అరెస్టు చేశారు.
కాగా, పెళ్లికి ఒప్పుకోకపోతే తన తండ్రిని చంపేస్తానంటూ ఓం ప్రకాశ్ బెదిరించాడని, తమ భూమిని కూడా లాక్కున్నాడని బాధిత యువకుడు ఆరోపించాడు.
ఈ ఘటనపై భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. నిందితుడు ఓం ప్రకాశ్ తో పాటు, లింగ మార్పిడి చేసిన బేగ్ రాజ్ పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి డాక్టర్లనూ కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బాధాకరమైన ఘటనతో యువకుడు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నాడని, అతనికి రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని కిసాన్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
- సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…
- భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…
- ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో…
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.