కాకినాడ జిల్లా జగ్గంపేట. స్థానిక కాకినాడ రోడ్ లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద టిడిపి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహన్ రావు బావ సామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్న క్యాంటీన్ ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం పేదవారికి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత సంవత్సర కాలం పైబడి జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఎన్నికల కోడ్ కారణంగా గత రెండు మాసాలుగా అన్న క్యాంటీన్ నిలుపుదల చేశామని మళ్లీ గతవారం ప్రారంభించి పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నామని టిడిపి ప్రభుత్వం ఏర్పడిన కారణంగా జగ్గంపేటలో అన్న క్యాంటీన్ శాంక్షన్ అయి ఉందని అదేవిధంగా గోకవరం కిర్లంపూడి గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంటామని ఐదు రూపాయలకే అన్నం పెట్టి పేదవారి ఆకలి తీరుస్తామని అన్నారు. అన్నఎన్టీఆర్ ఆశయం ప్రతి పేదవాడు కడుపునిండా అన్నం తినాలని కోరుకునేవారని దానిని నిజం చేస్తూ చంద్రబాబు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారని అన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన కులాల్లో పుట్టినప్పటికీ ఆర్థికంగా , విద్యాపరంగా, వృత్తి పరంగా ఉన్నత స్థానాల్లో ఉన్న కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకని ప్రశ్నించింది. ఇది సహేతుకంగా…
- సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ సంస్థ ఒకప్పుడు దేశంలోనే ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. లక్ష…
- యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..ఉత్తరప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలోని నరసరావుపేట ప్రాంతానికి చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్,…
- సింగపూర్లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు..కొవిడ్-19 మళ్లీ సింగపూర్ను కలవరపెడుతోంది. ఆ దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచి 16వ తేదీ మధ్య 12 వేల 700 కొత్త కేసులు నమోదైనట్లు సింగపూర్ వైద్య వర్గాలు వెల్లడించాయి. గత వారంతో…
- ప్లాస్టిక్పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం..ప్లాస్టిక్పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం. నిజామాబాద్ జిల్లా పల్లెల్లో ఇప్పుడు ప్లాస్టిక్పై అసలైన యుద్ధం ప్రారంభమైంది. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, టీ కప్పులు గ్రామాల్లో కనిపించకుండా చేయాలని గ్రామ పంచాయతీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆలూరు మండలం మచ్చర్ల గ్రామం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 82558