Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి

by Satya
శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి

తిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు. ఈ సందర్భంగా సురేష్ గోపి మీడియాతో మాట్లాడుతూ.12 సంవత్సరాల తర్వాత తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నానన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉందని తెలియజేశారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేరళ రాష్ట్రంలో పర్యటక రంగం తిరిగి పుంజుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వరదల నుంచి ప్రజలు సురక్షితంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014699
Total views : 80881

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.