1K
అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్తో చర్చల కోసం పాకిస్థాన్కు వెళ్లనున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో వారు భేటీ కానున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లడం లేదు. చర్చల్లో పురోగతి సాధిస్తే ఆయన పాకిస్థాన్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ పాకిస్థాన్కు వెళ్లనున్నారని ఇప్పటికే అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆయన తన పర్యటనకు ముందు పాకిస్థాన్ డిప్యూటీ పీఎం, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ పరిణామాలు, కాల్పుల విరమణ సంబంధిత అంశాలపై వారు మాట్లాడుకున్నారని తెలుస్తుంది.