రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దృశ్యాలు కలిచివేస్తున్నాయి. అతివేగంగా దూసుకు వచ్చిన స్కార్పియో కారు బస్సు కోసం రోడ్డుపై వెయిట్ చేస్తున్న మహిళలపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గంభీరావుపేట మండలం రాజరాజేశ్వరావు కాలనీకి చెందిన మహిళలు గజ సింగవరం బస్టాండ్ దగ్గర బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో రోడ్డుపై నిలబడ్డారు. ఐతే అతివేగంతో దూసుకొచ్చిన స్కార్పియో కారు ఆ బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రయాణికుల పైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతోపాటు రజిత అనే మరో మహిళ చిన్న కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
81
previous post




Total views : 76811