65
అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత సుడిగాలి పర్యటన నిర్వహించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో జరగనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లో కళ్యాణ మండపాలు, సభా ప్రాంగణాలు, వసతి సదుపాయాలను తనిఖీ చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరులో రుద్ర లక్ష్మి, సాయి శంకర్ కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందించారు. క్లస్టర్ స్థాయిలో జరిగే మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి అనిత..





Total views : 90065