ధరణి పోర్టల్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్ రూపకల్పన నుంచి టెండర్ల వరకు అన్ని అంశాలపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.ధరణి పోర్టల్కు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది.మాజీ డీజీపీ చారుసిన్హా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ధరణి పోర్టల్ టెండర్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పరిశీలించనుంది.వెండర్ ఎంపికలో ఏవైనా అక్రమాలు జరిగాయా, టెండర్ నిబంధనలు సక్రమంగా పాటించారా అనే అంశాలపై ప్రత్యేకంగా ఆరా తీయనుంది.అలాగే డేటా భద్రత, గోప్యత ఉల్లంఘనలు, పోర్టల్ రూపకల్పనలోని లోపాలు, అనధికార లావాదేవీలు, ప్రభుత్వానికి జరిగిన రెవెన్యూ నష్టంపై కూడా విచారణ చేపట్టనుంది.ధరణి పోర్టల్ నిర్వహణలో విదేశీ సంస్థల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ స్పెషల్ ఎంక్వైరీ టీమ్ దర్యాప్తు చేయనుంది.విచారణ పూర్తయిన అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్న ఈ బృందం, అవసరమైతే మధ్యంతర నివేదికను కూడా అందించనుంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు.
31
previous post