39
శాసనమండలిలో ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇస్తోందని స్పష్టం చేశారు.
భూముల కేటాయింపుల విషయంలోనూ పూర్తి వివరాలతో సమాధానాలు ఇస్తున్నామని శ్రీధర్బాబు తెలిపారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. సభలో చర్చకు వచ్చిన ప్రతి అంశంపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.