15
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు. ఆర్థిక మంత్రిగా కూడా రోశయ్య తనదైన ముద్ర వేశారని సీఎం పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రోశయ్యకు ప్రాధాన్యత కల్పించిందని చెప్పారు. తాను 2007లో తొలిసారిగా శాసనసభకు వెళ్లిన సందర్భాలను కూడా సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆర్యవైశ్య సమాజం కోసం నిర్మించనున్న ఆత్మగౌరవ భవన్ భవిష్యత్లో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు.