పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ అక్రమ గ్రావెల్ తరలింపుకు పాల్పడుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణ చేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రజాపోరాటం పేరుతో ఆయన రెండు రోజుల పాటు పాదయాత్రకు సిద్ధమైనారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలకు కేంద్రంగా మారినశేకూరు, వీరనాయకునిపాలెం, శలపాడు, వేజండ్ల, సుద్దపల్లి, చేబ్రోలు, వడ్లమూడి గ్రామాల మీదుగా పాదయాత్ర చేపట్టనున్నారు. గత నాలుగున్నరేళ్లలో 2200 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. 700 ఎకరాల్లో అక్రమ మైనింగ్ పై ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. గతంలో ఫిర్యాదుల ఆధారంగా విధించిన 5 కోట్ల రూపాయల ఫెనాల్టీ కూడా వసూలు చేయలేదని ధ్వజమెత్తారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు, అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదన్నారు. గతంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ స్థాయిలో, నేడు కిలారు మైనింగ్ కంపెనీలో అక్రమాలు జరగుతోన్నాయంటూ ఆయన ఆరోపణ చేశారు.
ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణ
326
previous post




Total views : 78283