గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ సమయములో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న మహేంద్ర కారును స్వాధీనం చేసుకుని అందులోని 77. 159 కేజీల గంజాయి ను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంకు చెందిన సూహైల్ పాషా,ఇమ్రాన్ అహ్మద్ లను అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణాకు కారకుడైన బెంగళూరుకు చెందిన ముహమ్మద్ సూఫీయల్ అనే అతని పై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఈబి అధికారులు తెలియజేశారు.
Guntur
గుంటూరు జిల్లా లాడ్జి సెంటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. నారా భువనేశ్వరికి అండగా చంద్రన్న తోడుకు టిడిపి శ్రేణులు శాంతియుత ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనకు అనుమతి లేదని గుంటూరు పోలీసులు అన్నారు. యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పడంతో, పోలీసులకి టిడిపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలను చేసి, ప్రభుత్వం అక్రమ అరెస్టులతో కట్టడి చేయలేదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. అనంతపురం నుంచి మంగళగిరి వరకు చేపట్టిన ఈ సైకిల్ యాత్ర నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చేరుకుంది. సైకిల్ యాత్రకు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ మండల కన్వీనర్ పెలపూడి వెంకటరత్నం తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.




Total views : 75088