నెల్లూరు జిల్లా(Nellore) సంగం గ్రామంలోని పలు కాలేజీల్లో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. కృష్ణార్జున రెడ్డి బిఈడి కాలేజ్, శ్రీ నేతాజీ డిగ్రీ కళాశాలలో.. ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్కాపింగ్ జరిగింది. దీంతో కాలేజీల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అబ్జర్వర్ లోపల ఉండీ కూడా పరీక్షలు నిర్వహించడం ఏంటని యాజమాన్యన్ని నిలదీశారు. మాస్ కాపీయింగ్ ను ప్రశ్నించినందుకు కరస్పాండెంట్ దాడి చేశారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. జిల్లా ఉన్నత అధికారులు వెంటనే స్పందించి.. పరీక్షలు రద్దుచేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…