అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఉదయం తెల్లవారుజామున నుండి దట్టమైన పొగ మంచు కురుస్తుంది. దీంతో వాహన చోధకులు పొగ మంచులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పొగ మంచుతో చింతపల్లిలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. దట్టమైన పొగ మంచుల ఆనందించాలంటే టూరిస్టులకు చింతపల్లి లంబసింగి కొత్తపల్లి జలపాతాలు. వంజరి మంచు సోయగాలు, చెరువులు, తాజ్ంగి డ్యాం పర్యాటలకు అనుకూలమైన ప్రదేశలుగా ఉన్నాయి. టూరిస్టులు ఎవరైనా ఈ ప్రాంతాలకు వచ్చి అందమైన వాతావరణాన్ని అనుభవించవచ్చని చింతపల్లి యూత్ అంటున్నారు.
Andhra Pradesh
నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభమైంది. నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నారా భువనేశ్వరి…చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనస్థాపం చెంది మృతి చెందిన చంద్రగిరిలోని ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. మధ్యాహ్నం 3 గంటలకు అగరాలలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు తిరుపతి, శుక్రవారం శ్రీకాళ హస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనున్నారు.
విశాఖలో కరెన్సీ కట్టలు కలకంరేపాయి. రూ.1.30 కోట్లు హవాలా డబ్బు గుట్టురట్టు అయ్యింది. ఎన్ఏడీ జంక్షన్లో హవాలా మనీ సంచలనంగా మారింది. వాషింగ్ మిషన్లో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. భారీగా కరెన్సీ కట్టలతో పాటుగా ఏకంగా 30 మొబైల్స్ను కూడా సీజ్ చేశారు ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు. అలాగే వాహానాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీ కట్టలు సోనోవిజన్ సంస్థకు చెందిందిగా తెలుస్తోంది. ఏపీలో 35 బ్రాంచీలకు చెందిన 1.30 కోట్ల నగదును విజయవాడకు తరలిస్తూ అడ్డంగా బక్కైంది సోనోవిజన్ జమాన్యం..ప్రభుత్వానికి కట్టవలసిన టాక్సులు ఎగ్గొట్టి దొడ్డి దారిలో.. బ్లాక్ మనీ దారి మల్లిస్తున్న సోనోవిజన్ MD మూర్తి య 30 సెల్ఫోన్లు, వాహనం స్వాధీనం చేసుకున్నారు ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సక్రమమైన డబ్బైతే వాషింగ్ మెషీన్, ఫ్రిజ్ లలో..,. నోట్ల కట్టలు ఎందుకు తరలిస్తున్నారని పోలీసులు విచారిస్తున్నారు. సోనోవిజన్ md. మూర్తి కేసును తారుమారు చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా లో అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తున్నది. ఇక్కడి సూర్యదేవాలయం లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. హర్షవల్లి అనే ప్రాచీన పేరు అరసవల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా వుంది. సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట.
150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి , అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ది చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ వుంది. ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకుతాయి.అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. ఇకపోతే… అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. నేడు తుఫాను కారణంగా ఆకాశం మబ్బులు పట్టడంతో ఆందోళన చెందిన భక్తులకు సూర్యకిరణాలు మూడు నిముషాలసేపు మూలవిరాట్టు పాదాలపై పడడంతో భక్తుల ఆనందానికి అంతులేకుండా పోయింది.
పల్నాడు జిల్లా , గురజాల మండలం ,జంగమహేశ్వరపురం గ్రామంలో జరిగిన కృష్ణారెడ్డి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే యరపతినేని స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈసందర్బంగా యరపతినేని మాట్లాడుతూ..మహేష్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయని మండిపడ్డారు. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 11 మంది చనిపోయారని, కాసు మహేష్ రెడ్డి చేసే అక్రమ మైనింగ్ వల్ల ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారని అన్నారు. మహేష్ రెడ్డి ఓటమి అంచున ఉన్నారని రాబోయే ఎన్నికలలో తనను ఢీకొనలేకనే తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని అన్నారు.
రాజకీయంగానే కాకుండా చంద్రబాబు విజన్పై కూడా ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఐటీ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. గూగుల్లో ఆయన చేసిన అభివృద్ధి పనులు కనిపించకుండా కేవలం స్కిల్ డెవలప్మెంట్ కేసు మాత్రమే కనిపించేలా చంద్రబాబు పేరును అబాసుపాలు పేర్కొన్నారు. ఐటీ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచే హైదరాబాద్లోని సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు ఘనంగా నిర్వహించేందుకు అక్టోబరు 29న గచ్చిబౌలి మైదానంలో పెద్ద ఎత్తున మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నట్లు ఐటీ ఉద్యోగులు తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన iamwithcbn.co వెబ్ సైట్ ను జూబ్లీహిల్స్ లో లాంఛనంగా ఆవిష్కరించారు. చంద్రబాబుపై కృతజ్ఞత చూపించే ఐటీ ఉద్యోగులు, వివిధ రంగాల్లో స్థిరపడిన అభిమానులంతా వెబ్సైట్లో తమ పేరు నమోదు చేసుకొని గచ్చిబౌలిలో నిర్వహించండి స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ కూడా జైల్లో ఉన్నారని, ఏపీ ప్రజల కోసం చంద్రబాబు జైల్లో ఉండటం వల్ల ఆయనకు ఎలాంటి మలినాన్ని అంటుకోదని పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఘనంగా జరిగింది. దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ, మల్లేశ్వరాస్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. ఈ విగ్రహాలను దక్కించుకోవడానికి 3 గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలబడ్డారు. తరతరాలు వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జరిగిన ఈ కర్రల సమరంలో పెద్దఎత్తున్న ప్రజలు పాల్గొన్నారు. ఓ చేతిలో కర్ర.. మరో చేతిలో దివిటీలు.. మది నిండా భక్తిభావంతో దేవరగట్టు మారుమోగింది. దేవతా మూర్తుల కోసం నెరణికి, కొత్తపేట, నెరణికితండా, బిలేహాల్, ఆలూరు, ఎల్లార్తి, సుళువాయి గ్రామాల మధ్య కర్రల సమరం సాగింది. పలువురు విచక్షణారహితంగా కొట్టుకుకోవడంతో సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు ఆలూరు ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. కాగా, బన్నీ ఉత్సవంలో ప్రమాదం చోటుచేసుకున్నది. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు సమీపంలోని చెట్టుపైకి ఎక్కారు. ప్రమాదవశాత్తూ అది విరిగిపడటంతో గణేశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరికొదరు గాయపడ్డారు.
కాసేపట్లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభం కానుంది.. నిజం గెలవాలి పేరుతో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో మూడు రోజుల పర్యటించన్నారు నారా భూవనేశ్వరి .. నేటికి 47 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబు… అరెస్టును ఖండిస్తూ నిజం గెలవాలి కార్యక్రమం.. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. ఉదయం 10.30 గంటలకు నారావారిపల్లె నుంచి బాధిత కుటుంబాల వద్దకు వెళ్లనున్న భువనేశ్వరి.. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆవేదన చెంది గత నెల 25న చనిపోయిన పాకాల మండలం, నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ కుటుంబాన్ని పరామర్శిచనున్న భువనేశ్వరి.. అనంతరం ఈ నెల 17న మరణించిన చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శ మధ్యాహ్నం 3 గంటలకు అగరాలలో చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి… రేపు తిరుపతి, శుక్రవారం శ్రీకాళ హస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం..
గుంటూరు జిల్లా, తెలుగుదేశం పార్టీ అద్వర్యంలో చంద్రబాబుకి మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేశారు. అక్రమ కేసులను ఖండిస్తూ జరిగిన అన్యాయానికి నిరసనగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో … నారా లోకేష్ ఆదేశాల మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, కార్యకర్తలతో కలిసి విజయదశమి సందర్భంగా “ దేశం చేస్తుంది రావణ దహనం – మనం చేద్దాం జగనసుర దహనం ” పేరుతో భారీ రావణ జగణాసుర కటౌట్ దహనం చేశారు. అనంతరం సైకో పోవాలి సైకిల్ రావలంటు నినాదాలు చేశారు.
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామంలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జగనాసుర పేపర్లను దహనం చేస్తు, సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము, కార్య నిర్వహన కార్యదర్శి గొనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గోన్నారు.




Total views : 202846