336
పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించేందుకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అందిస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అర్హులైన 10,511 జంటలకు 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి, గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు 3 త్రైమాసికాల్లో మూడు విడతల్లో ఈ ఆర్థిక సాయం అందించామన్నారు. గత ప్రభుత్వం ఏనాడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో ఇలాంటి పథకాలు తీసుకురాలేదన్నారు. పేదలకు మంచి జరగాలని అడుగులు వేయలేదన్నారు. తమ ప్రభుత్తవం మంచి సంకల్పంతో ఈ పథకాన్ని అమలుచేస్తుందన్నారు.





Total views : 78550