ఏపీ మాజీ సీఎం జగన్పై ఆయన తల్లి వైఎస్ విజయమ్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. నోటరీ ద్వారా ఆస్తుల పంపిణీ వివరాలను వెల్లడించిన ఆమె… షర్మిలను సమర్థిస్తూ, జగన్పై విమర్శలు చేశారు. వైఎస్ చనిపోయే నాటికి ఉన్నవన్నీ కుటుంబ ఆస్తులేనని, పంపకాలు జరగలేదని స్పష్టం చేశారు. ఆస్తులు నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావించారని వెల్లడించారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు, కోడలికి అన్యాయం చేశాడని అన్నారు. ఎప్పటికైనా ఈ విషయంలో న్యాయం చేస్తాడని తల్లిగా భావిస్తున్నానని విజయమ్మ తెలిపారు. అలాగే MOU లో షర్మిలకు రాసిన ప్రతీ ఆస్తి ఆమెకు చెందాల్సిందేనని.. అందుకే జగన్ కూడా దీన్ని రాశాడని చెప్పారు. అంతేకాదు నిజానికి ఆమెకు తక్కువే రాశాడని… సరస్వతి సిమెంట్తో సహా MOU లో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే అని విజయమ్మ స్పష్టం చేశారు. అలాగే జగన్ ఇచ్చాను అని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే అన్నారు. ఆస్తుల పంపకం జరగలేదని మరోసారి స్పష్టం చేసిన విజయమ్మ… నిజం ఏంటో దేవుడికి, తన కొడుక్కి తెలుసని నోటరీ ద్వారా వెల్లడించారు.
#Jagan
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్లకండువాలతో సభకు హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్యే గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
రాష్ట్ర విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని చెప్పారు. రెవెన్యూ లోటును, ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. 2014 లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఏపీ అభివృద్దికి కృషి చేశారని, వైసీపీ పాలనలో రాష్ట్రం వెనకబడిందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలను ఆయన అభినందించారు. కాగా, గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని, అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉబెర్ సంస్థకు సూచించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉబెర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్…
- ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగం దూసుకెళుతోందని, ‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన బుధవారం సోషల్…
- ఉప్పల్ ఆర్క గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్లో రూల్స్ ఉల్లంఘన..విద్య వ్యాపారంగా మారింది. పిల్లల చదువులను పెట్టుబడిగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నాయి విద్యాసంస్థలు. ఇంటర్నేషనల్, గ్లోబల్ అని బోర్డులు తగిలించుకుని… తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. ఉప్పల్ పీర్జాదీగూడలోని ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ సంగతి సరిగ్గా ఇదే. పేరుకు ఇంటర్నేషనల్ స్కూలే…
- అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ.. వీఎంఆర్డీఏ, పంచాయతీ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లతో కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు. పెదరాంబద్రపురం, నామవరం పరిధిలోని పలు సర్వే నంబర్లలో…
- నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో బయటికొస్తున్నాయి. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వివేకా హత్య కేసులో సీఎం పాత్ర..
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో సీఎం జగన్ పాత్ర ఉందంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా హత్యకు కుట్రలో జగన్ హస్తం ఉందని, అందుకే కేసు దర్యాఫ్తునకు ఆటంకం కలిగిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం మీడియాతో మాట్లాడుతూ సొంత చెల్లెలికే న్యాయం చేయని వ్యక్తి ప్రజలకు మాత్రం ఏం చేస్తాడంటూ ప్రశ్నించారు. బాబాయ్ హత్య కేసు విచారణను అడ్డుకుంటున్నాడని జగన్ పై ఆరోపణలు గుప్పించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న అవినీతికి అంతేలేకుండా పోతోందని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చదవండి: జగన్ రాయలసీమ ద్రోహి- టీడీపీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, అధికార యంత్రాంగంతో రాజకీయ ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. రాజమండ్రి కేంద్రంగా ఇసుక దందా చేస్తున్నారని, బ్యారేజ్ కింద ఇసుక మొత్తం తవ్వేస్తున్నారని చెప్పారు. ఇసుక మాఫియా ద్వారా రోజుకు రెండు కోట్లు దోచుకుని దాచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల ధన దాహానికి రాజమండ్రి బ్యారేజ్ కు ముప్పు పొంచి ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష టీడీపీ జనసేన పొత్తు. జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 99 ఎమ్మెల్యే అభ్యర్థుల ఉమ్మడి జాబితా విడుదల చేశారు. ఈ అభ్యర్థులను చూసి వై నాట్ 175 అన్న జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కనిపించింది. 63 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ముగ్గురు డాక్టర్లు ఒక ఐఏఎస్ అధికారితో పాటు అందరూ ఉన్నత విద్య చదివిన వారే కచ్చితంగా గెలిచే అభ్యర్థులకే సీటు కేటాయించిన ఘనత చంద్రబాబుకి దక్కింది.
కాపు రిజర్వేషన్ క్యాన్సిల్ చేసినప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని ఎక్కడికి వెళ్లారు గాడిదలు కాస్తున్నారా స్వాతంత్ర కాలం నుండి రాజంపేట కాపులకు ఇచ్చారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక మిథున్ రెడ్డికి కేటాయిస్తే వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించలేదు. ముఖ్యంగా ఈ జాబితాలో దళితులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి సామాజిక న్యాయం చేశారు. పొత్తుపై అవాక్కులు, చవాక్కులు పేలుస్తున్న వారికి నా సమాధానం కోటి 3 లక్షల 33 వేల ప్రజాభిప్రాయ సేకరణ మేరకే అభ్యర్థుల ఖరారు చేశారు గెలిచే అభ్యర్థులకే సీటు ఇచ్చారు అని తెలిపారు.
చిత్తూరు (Chittoor):
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం జరిగే సీఎం సభకు మారుమూల ప్రాంతాలు పలమనేరు, కుప్పం, పుంగనూరు మిగిలిన ప్రాంతాల నుండి జన సమీకరణ లో భాగంగా ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారు. జిల్లాలోని వైసీపీ నాయకులు దాదాపు 390 బస్సు సర్వీసులు గాను 90 బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో, కుప్పం పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. రాప్తాడులో జరిగే సిద్ధం సభ విజయవంతం చేయడానికి చిత్తూరు జిల్లాలోని నాయకులు జన సమీకరణలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భారీ సంఖ్యలో ప్రజలను ఆర్టీసీ బస్సుల ద్వారా తరలిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్ష జరుగుతున్న సమయంలో బస్సుల కోసం విద్యార్దులు ఎదురుచూస్తున్నారు. కేవలం అరకొర బస్సు సర్వీసులు మాత్రమే కుప్పం, పలమనేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
- ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..by CVR NEWSఆంధ్రప్రదేశ్లో తయారీ రంగం దూసుకెళుతోందని, ‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన బుధవారం సోషల్…
- అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..by CVR NEWSఅనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ.. వీఎంఆర్డీఏ, పంచాయతీ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లతో కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు. పెదరాంబద్రపురం, నామవరం పరిధిలోని పలు సర్వే నంబర్లలో…
- తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..by CVR NEWSగుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మారిస్పేట కాలువ కట్ట వద్ద ఉన్న ‘సూర్య శిల్పశాల’లో ఇటీవల ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎంతో శ్రమించి తయారు చేసిన అనేక విలువైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరినందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తండ్రిపై కేసులు పెట్టి.. అన్న జగన్ను 16 నెలలు జైలులో వేసినా షర్మిల… కాంగ్రెస్ లో చేరడం సిగ్గుచేటన్నారు. షర్మిల చేస్తున్న ద్రోహానికి స్వర్గంలో ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి కూడా కంటతడి పెట్టుకుంటారని అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజుపాలెంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో నల్లపురెడ్డి పాల్గొన్నారు. జగన్ను ఓడించేందుకే వైస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. ఇందుకు భగవంతుడు కూడా ఆమెను క్షమించడన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, షర్మిలకు డిపాజిట్లు దక్కవని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశానని.. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటానని సీఎం జగన్కు వివరించినట్లు తెలిపారు. రాజకీయాల్లో విసిగిపోయానన్నారు. పార్టీ కోసం తప్పకుండా పోటీ చేయాలని సీఎం జగన్ కోరుతున్నారని.. అయితే పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని సీఎంకు చెప్పానన్నారు. అయితే అందుకు ముఖ్యమంత్రి ఒప్పుకోవడం లేదన్నారు. ప్రజలు ఏది కోరుకుంటే అదే చేస్తానని.. ప్రజలు వద్దనుకుంటే పోటీ చేయానని మంత్రి ధర్మాన తేల్చి చెప్పారు.
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు లంచాలిస్తేనే పనులు జరిగేవని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో అక్కాచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో ఈ మంచి ఎందుకు జరగలేదని అందరూ ఆలోచించాలని సూచించారు. గతంలో దోచుకో, పంచుకో అన్నట్టుగా ఉండేదని ఇప్పుడు మీ బిడ్డ బటన్ నొక్కితే, నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బు జమ అవుతోందని ఈ తేడాను గమనించాలని కోరారు. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఆ మాటను గాలికొదిలేశారని జగన్ విమర్శించారు. చంద్రబాబుతో పొదుపు సంఘాలకు నష్టం జరిగిందని అన్నారు. ఇప్పుడు అవే పొదుపు సంఘాలు మంచి శాతంతో గ్రేడులు సాధించి గర్వంగా నిలబడ్డాయని చెప్పారు. కుట్రలు, కుతంత్రాల జెండాలు కట్టడమే చంద్రబాబు అండ్ కో అజెండా అని ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా అని అన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు.
Read Also..
Read Also..
విజయవాడ, కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు చేస్తున్న అమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు. కోడి కత్తి శీను ను వెంటనే విడుదల చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. కోడి కత్తి శీను జైలు నుండి బయటకు రావాలని మూడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కోడికత్తి శీను కుటుంబ సభ్యులు. కోడికత్తి శీను తల్లి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన ఆరోగ్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రి తరలించిన పోలీసులు. పోలీసులు నిరాహార దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో పోలీస్ జీబు ముందు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోబోయిన నిరసనకారులు. వెంటనే స్పందించి అతని వద్ద ఉన్న అగ్గిపెట్టెను లాక్కున్న పోలీసులు. నిరసనకారులను చెదరగొట్టి కోడి కత్తి శీను కుటుంబ సభ్యులను విజయవాడ హాస్పటల్ తరలించిన పోలీసులు.
ఉరవకొండ, ఈనెల 23న ఉరవకొండలో జరిగే వైఎస్ఆర్ ఆసరా బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం కలెక్టరు గౌతమి, ఎస్పీ అన్బురా జన్, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం పట్టణం లోని తొగటవీర క్షత్రియ కల్యాణ మండపంలో జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. 7,876 లక్షల మంది మహిళలకు రూ.6,379 కోట్ల ఆసరా మొత్తాన్ని సీఎం విడుదల చేయనున్నారని తెలిపారు. ఏపీ ఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందురెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, ఎమ్మెల్యే శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ సీఈఓ వైభోమ్ నిదియాదేవి, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులురెడ్డి, స్థానిక తహసీల్దారు శ్రీధరమూర్తి పాల్గొన్నారు.






Total views : 75478