Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Andhra Pradesh ప్రజలు ఏది కోరుకుంటే అదే చేస్తాను…

ప్రజలు ఏది కోరుకుంటే అదే చేస్తాను…

by Prakash
Minister Dharmana Prasada Rao

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశానని.. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటానని సీఎం జగన్‌కు వివరించినట్లు తెలిపారు. రాజకీయాల్లో విసిగిపోయానన్నారు. పార్టీ కోసం తప్పకుండా పోటీ చేయాలని సీఎం జగన్ కోరుతున్నారని.. అయితే పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని సీఎం‌కు చెప్పానన్నారు. అయితే అందుకు ముఖ్యమంత్రి ఒప్పుకోవడం లేదన్నారు. ప్రజలు ఏది కోరుకుంటే అదే చేస్తానని.. ప్రజలు వద్దనుకుంటే పోటీ చేయానని మంత్రి ధర్మాన తేల్చి చెప్పారు.

Advertisements

You may also like

Our Visitor

019589
Total views : 91183

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.