అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్.. ఎదురయ్యింది. ఈ కేసు కంటే ముందే తాను నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2022లో బెస్ట్ కొరియోగ్రాఫర్ కు ఎంపికయ్యారు. ఈ అవార్డును రద్దు చేస్తూ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిటీ ప్రకటనను విడుదల చేసింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు షాక్ తగిలింది. పోక్సో కేసు నమోదు అవ్వడంతో జానీ మాస్టర్ కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. 2022ఏడాదికి గాను తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరు సినిమాకు బెస్ట్ కొరియో గ్రాఫర్ గా జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు వరించింది. అక్టోబర్ 8న ఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ ఉంది. అయితే రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకునేందుకు అనుమతి కోరారు. రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేస్తూతీర్పును ఇచ్చింది. దీంతో అవార్డు ఫంక్షన్ కు హాజరయ్యేందుకు జానీ మాస్టర్ రెడీ అవుతున్నతరుణంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కుప్పం ఎయిర్పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..కుప్పం విమానాశ్రయ భూసేకరణకు మార్గం సుగమమైంది. 150 ఎకరాల సేకరణ నోటిఫికేషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తెలిపింది. భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై పలువురు సుప్రీం కోర్టులో…
- 15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..ఇక్కడ బాలికది సాధారణమైన గర్భంకాదు.. అత్యాచారం చేయబడి గర్భం దాల్చింది. తన గర్భంలో పెరుగుతున్నదీ..పెంచుతున్నదీ నిందితుడి ప్రతిరూపం..గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తే..తల్లీ బిడ్డల ప్రాణాలకు హాని జరుగొచ్చు..లేదా తల్లి క్షేమంగా ఉన్నా…బిడ్డ చనిపోతే…భ్రూణ హత్య ..అదీ సరికాదు…సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైనా సరే..…
- బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని స్పష్టం చేశారు. ‘మా-మాటి-మానుష్’ స్ఫూర్తితో టీఎంసీ ప్రభుత్వాన్ని తిరిగి…
- కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..బ్రహ్మంగారిమఠం వివాదం మళ్ళీ మొదలైంది. తాత్కాలిక పీఠాధిపతిగా నియామకమైన వెంకటాద్రి స్వామి పూర్వపు పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మారుతి మహాలక్ష్మి నివాసం ఉంటున్న గృహానికి గుర్తుతెలియని వ్యక్తులు…
- తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ బాధ్యతలు స్వీకరించడం పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీయనుంది. హైదరాబాద్లో జన్మించిన ఆనంద్ చిన్నప్పటి నుంచే ప్రతిభను చాటుకుని విద్యలో అగ్రగామిగా నిలిచారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువు కున్న సి వి ఆనంద్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 61692