Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh నక్కపల్లి మంత్రి నివాసం వద్ద మహానాడు పోస్టర్లు ఆవిష్కరించిన హోం మంత్రి అనిత

నక్కపల్లి మంత్రి నివాసం వద్ద మహానాడు పోస్టర్లు ఆవిష్కరించిన హోం మంత్రి అనిత

by CVR NEWS
నక్కపల్లి మంత్రి నివాసం వద్ద మహానాడు పోస్టర్లు ఆవిష్కరించిన హోం మంత్రి అనిత

ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. నక్కపల్లి మంత్రి నివాసం వద్ద మహానాడు పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్‌ పద్ధతిలో పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించే మహానాడు కల్యాణ మండపాలు, స్థలాలను పరిశీలించారు. అలాగే, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం, కోటవురట్ల మండలాల్లో మహానాడు ఏర్పాట్లును అనిత పరిశీలించారు.

పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. యస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో రుద్రలక్ష్మి, సాయిశంకర్‌కు ఇంటికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం కాదని తెలిపారు. తెలుగుదేశం బలం, త్యాగం, క్రమశిక్షణ, సంస్థాగత స్ఫూర్తికి ప్రతిబింబమని అభివర్ణించారు. తెలుగుజాతి ప్రగతి, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్యానించారు. కోవిడ్ సమయంలో మహానాడును వర్చువల్‌గా ఏర్పాటు చేసుకున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019153
Total views : 90017

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.