Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Technology ఫోన్ వాడుతున్నారా.. ఈ తప్పులు చేయొద్దు!

ఫోన్ వాడుతున్నారా.. ఈ తప్పులు చేయొద్దు!

by Satya
Mobile phone

చార్జింగ్ 15 నుంచి 20 పాయింట్లు ఉన్న సమయంలోనే మనకు మొబైల్ వార్నింగ్ ఇస్తుందని, ఆ సమయంలో తప్పనిసరిగా ఫోన్‌కు త్వరగా చార్జింగ్ పెట్టుకునే ప్రయత్నం చేయాలని, మొబైల్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయ్యేంతవరకు వాడితే మాత్రం మొబైల్ బ్యాటరీ లైఫ్ టైం చాలా వరకు తగ్గిపోతుందని పేర్కొన్నారు. బ్యాటరీ లైఫ్ టైం నాణ్యతతో పని చేయాలంటే రాత్రి పడుకునే సమయాల్లో, ఫోన్ ఫుల్ చార్జింగ్ అయిన తర్వాత కూడా అలానే ఉంచడం ద్వారా కూడా మొబైల్ బ్యాటరీ లైఫ్ టైం చాలా వరకు తగ్గిపోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. మరి ముఖ్యంగా రాత్రి సమయాల్లో చార్జింగ్ పెట్టి ఉదయం వరకు అలానే ఉంచితే బ్యాటరీపై అదనపు భారం పడి త్వరగా బ్యాటరీ ఉబ్బి కొత్త మొబైల్ అయినా సరే ఐదు నుంచి మూడు మాసాలలోనే పాడైపోతుంది. ఎవరైనా సరే ఉదయం లేచిన వెంటనే చార్జింగ్ పెట్టుకుని మన నిత్యవసర పనులు, ఇంట్లో చేసుకునే సమయం వరకు చార్జింగ్ పెడితే ఫోన్ చార్జింగ్ ఫుల్ అవుతుందని, ఇది మంచి సమయం కూడా అని, ఫోన్ చార్జింగ్ ఫుల్ అయితే మనం చూసుకొని దాన్ని తీసివేయడం జరుగుతుందని తద్వారా బ్యాటరీపై భారం కూడా పడదని నిర్వాహకులు వివరించారు. ఇలా చిన్నచిన్న సలహాలు పాటిస్తే సెల్ ఫోన్ బ్యాటరీ త్వరగా పాడవకుండా రక్షించుకోవచ్చు.

Advertisements

You may also like

Our Visitor

009383
Total views : 62172

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.