పటాన్ చెరువు నియోజకవర్గంలో శ్రీవారి ఆశీస్సుల వల్లనే హ్యాట్రిక్ కొట్టానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉండి నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తామని, ప్రజా సమస్యల పైన పోరాడుతామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు.