Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshKarnool నంద్యాలలో పర్యటించనున్న సీఎం..

నంద్యాలలో పర్యటించనున్న సీఎం..

by Rama
jagan mohan reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ దగ్గర నిర్మిస్తున్న సొరంగం పనులు పూర్తి కావడంతో ఈ టన్నెల్ ను జాతికి అంకితం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన వస్తున్నారని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. గాలేరు నగరి వరద కాలువ నిర్మాణంలో భాగంగా అవుకు రిజర్వాయర్ సమీపంలో రెండు టెన్నల్ ల నిర్మాణానికి అప్పటి వైయస్ ప్రభుత్వం 2008 లో శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ఒక్కొక్కటి ఆరు కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగాలను 436 కోట్లతో నిర్మించారని కాటసాని రామిరెడ్డి తెలిపారు. టన్నెల్ దగ్గర ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014083
Total views : 78929

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.